Sunday, January 1, 2012

ఢిల్లీ పీఠంపై జెండా నాటిన ఒకే ఒక్క తెలుగువాడు

తెలంగాణ తేనె మాగాణంలో పల్లవించిన మేరునగం ఆయన! రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సహస్ర ప్రతిభా దళాలతో పరిమళించిన విశిష్ట వ్యక్తిత్వం ఆయన సొంతం! జాతీయ కాంగ్రెస్ మహా నేతల్లో జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహాదుర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ శ్రేణిలో ప్రధాని పదవిని అలంకరించిన దిట్ట! దేశంలో ఏకైక తెలుగు ప్రధాని.. తెలంగాణబిడ్డ! కేవలం ముఖ్యమంవూతులుగా పని చేసిన ఎన్టీఆర్, వైఎస్ సహా ఎందందరి విగ్రహాలో పల్లెలు మొదలు నగరాల కూడళ్ల దాకా కుప్పలు తెప్పలుగా నిలు నిలబడి ధగధగలాడుతుంటే.. దేశానికే ప్రధానిగా పని చేసి కనీసం సొంత గ్రామంలో కూడా విగ్రహానికి నోచుకోని తెలంగాణ రాజకీయ పేద! మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు నిరాటంకంగా నడిపి, రాజకీయ చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న దురంధరుడైనా.. కనీస గుర్తింపునకు నోచుకోని మేధావి! హైదరాబాద్ నగరంలో ఎక్స్‌ప్రెస్ వే మినహా ఏ ఒక్క మార్గానికి లేదా.. పార్కుకు పేరు పెట్టడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు మనసొప్పని దారుణ వివక్షను ఎదుర్కొన్న దివంగత నేత..! పాములపర్తి వేంకట నర్సింహారావు! తెలంగాణకు ఠీవిగా నిలిచిన పీవీ ఏడవ వర్థంతి నేడు! ఈ సందర్భంగా ఆయన సమకాలికులు, ఆయన అడుగుజాడల్లో నడిచినవారు, ఇంకా నడుస్తున్న వారు నెమరేసుకున్న జ్ఞాపకాలు.. పీవీ రాజకీయ జీవిత విశేషాలు

హైదరాబాద్, డిసెంబర్ 22 (టీన్యూస్)టైపధాని పదవి అధిరోహించిన ఏకైక తెలుగువాడు.. ప్రత్యేకించి తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావు. ఒక మహనీయుడు చనిపోతే ఇవ్వాల్సిన కనీస గౌరవాలకు నోచుకోని నేతగా మిగిలిపోయారు. దేశ ప్రధానిగా పని చేసిన మహా నేత చనిపోయి నేటికి ఏడేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ ఆయ విగ్రహం ఎక్కడా లేదంటే కొంత ఆశ్చర్యకరమే! హైదరాబాద్ నగరంలోని ఎక్స్‌ప్రెస్ వే మినహా మరెక్కడా పేరు ఆయన పేరు కనిపించదు. ఇది ఆ మహానుభావుడికి కాంగ్రెస్ పార్టీ, దాని నాయకత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన.. ఇస్తున్న ‘గౌరవం’!!

దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు 1991 జూన్ 21న పీవీ నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆయన ఎంపీ కూడా కారు. ఆ తరువాత రాష్ట్రంలోని నంద్యాల నుంచి పోటీ చేసి 5,80,287 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అది కూడా ప్రచారానికి రాకుండానే. పీవీ అధికారం చేప పంజాబ్, కశ్మీర్, అసోం రాష్ట్రాల్లో ఉగ్రవాదుల హింసాయుత కార్యకలాపాలు దేశ సమైక్యత, భద్రతకు ఒక సవాల్‌గా పరిణమించాయి. దీనికితోడు దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుని ఉంది. దీనితో ఒకవైపు దేశంలో పరిస్థితులను చక్కదిద్దుతూనే ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చాల్సిన బాధ్యత పీవీపై పడింది. నడుపుతున్నది మైనార్టీ ప్రభుత్వమే అయినా.. తనదైన కార్యనిర్వాహణతో అన్ని వర్గాలను ఆకట్టుకుని అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు, వ్యూహరచనతో ముందుకు సాగారు. తన మంత్రివర్గంలో తెలుగువారికి ప్రాధాన్యం ఇస్తూ.. కోట్ల విజయభాస్కర్‌డ్డి, కమాలుద్దీన్ అహ్మద్, మల్లికార్జున్, వెంకటస్వామి, చింతామోహన్, కమలకుమారి, పీవీ రంగయ్యనాయుడును మంత్రులను చేశారు.

ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేకపోవడంతో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినా.. దానిని ఎదుర్కొని సర్కారును నెట్టుకొచ్చారు. దేశ ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దడంలో పీవీ చేపట్టిన నూతన ఆర్థిక విధానాలు వివాదాస్పదమైనా, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నా.. దేశంలో నూతన పారిక్షిశామిక అభివృద్ధికి పీవీ బాటలు వేశారన్నది వాస్తవం. ఇందులో ప్రధానమైనది లైసెన్స్ రాజ్ వ్యవస్థను రద్దు చేయడం.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా
అప్పటి ఏఐసీసీ అధినేత, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 1991 మే 21న శ్రీపెరంబదూర్‌లో హత్యకు గురయ్యారు. అప్పటికే మధ్యంతర ఎన్నికల్లో ఒక విడత ఓటింగ్ పూర్తయి రెండవ విడత ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందిర హత్యానంతరం రాజకీయాల్లోకి వచ్చిన రాజీవ్ కూడా హత్యకు గురికావడంతో ఇక కాంగ్రెస్‌కు దిక్కెవరన్న చర్చ జరిగింది. పార్టీ బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన భార్య సోనియా నిరాకరించారు. దీంతో అప్పటికే ఇందిర, రాజీవ్ మంత్రి వర్గాల్లో కీలక శాఖలు నిర్వహించిన పీవీని తాత్కాలికంగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఎన్నికల ఫలితాలు వెలవడ్డాక ప్రభుత్వం ఏర్పాటుకు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ 224 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో హస్తినలో తొలి తెలుగు నేత ప్రధాని పీఠం అధిష్టించినట్లయింది.

వరంగల్‌తో అనుబంధం
వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న పీవీ జన్మించారు. సీతారాంరావు, రుక్మాబాయమ్మ దంపతులకు ఆయన తొలిసంతానం. పీవీ ఉన్నత విద్యాభ్యాసం హన్మకొండలో జరిగింది. అప్పటికే వరంగల్, హన్మకొండ జంటనగరాలుగా, అత్యంత చైతన్యవంతంగా ఉండేవి. నాటికే రాజకీయ, సాంస్కృతిక, సంఘసంస్కరణ ఉద్యమాలు ఆవిర్భవించాయి. మద్రాస్, మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వారు వరంగల్ పాఠశాలలో, కళాశాలలో ఉపాధ్యాయులుగా చదువులు చెప్పేవారు. పాఠశాల రోజుల్లోనే పీవీ ప్రతిభావంతుడిగా, చురుకైన విద్యార్థిగా, సూక్ష్మగ్రాహిగా పేరు తెచ్చుకున్నారు. యువకుడిగా ఉన్న కాలంలోనే కందుకూరి, గురజాడ, పానుగంటి, చిలకమర్తి, గిడుగు, తిరుపతి వెంకటకవులు, వెంకట పార్వతీశ్వర కవులు, కాశీనాథుని నాగేశ్వరరావు వంటి మహానీయుల రచనలు ఆయన్ని ఎంతో ఆకర్షించాయి. లలితకళలలో కూడా పీవీకి మంచి ప్రవేశం ఉంది. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్ళి సినిమాలు చూసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. పీవీ స్వయంగా ఎన్నో వృత్తాలు, ద్విపదలు, గీతాలు రాశారు. దేశ చరిత్రలో ప్రసిద్ధుడైన జయచంద్రుని గురించి ‘జయచంద్ర హైందవద్వంసకా’ అనే కవిత వరంగల్‌లోని భజనమండలిలో బాగా ప్రచారం పొందింది. మహాకవి గ్రే ఎలిజీని రచనను తెలుగులోకి అనువదించారు. ‘గాదర్డ్ పెటల్స్’ అనే పేరుతో ఇంగ్లీష్‌లో కొన్ని భావ గీతాలు కూడా రాశారు. ఇంతటి అనుభవాలున్న పీవీ మహాకవి కాలేదు. నవలా రచయిత కాలేదు. కానీ.. రాజకీయ నాయకుడయ్యారు.

హైదరాబాద్ స్వాతంవూత్యోద్యమం
దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. హైదరాబాద్ సంస్థానంగా ఉన్న నిజాం ప్రభుత్వం ఇక్కడి స్టేట్ కాంగ్రెస్‌పై నిషేధాన్ని తొలగించింది. దాంతో స్వామి రామానందతీర్ధ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమయ్యే దశలో చోటు చేసుకున్న ఘటనలు పీవీని ఆవేదనకు గురి చేశాయి. అవే ఇతివృత్తాలుగా నీలంపట్టు చీర అనే శీర్షికతో పీవీ కథ రాశారు. పోలీసు చర్య తర్వాత 1948లో వరంగల్‌లో పీవీ తన సన్నిహిత మిత్రుడైన పాములపర్తి సదాశివరావుతో కాకతీయ అనే పత్రికను స్థాపించారు. పోలీసు చర్య అనంతరం కొంత కాలానికి మిలిటరీ ప్రభుత్వం స్థానంలో సీనియర్ ఐపీఎస్ వెల్లోడి సీఎంగా పౌరపాలన ఏర్పడింది. పోలీసు చర్య తర్వాత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ రెండుగా చీలింది. రామనంద నాయకత్వంలో అతివాద వర్గం, జనార్ధన్‌రావు దేశాయి, బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగాడ్డితో మితవాద వర్గాలు ఏర్పడ్డాయి. రామానంద నాయకత్వాన్ని పీవీ సమర్థించారు. తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని శాంతి భద్రతల సమస్యగా చూడరాదని స్వామి రామానంద అన్న మాటలు పీవీని ఎంతగానో ఆకర్షించాయి. అందుకే పీవీ ఆయన పట్ల ఆయన గౌరవ భావాన్ని కలిగి ఉండే వారు. 1952 జనవరిలో హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అప్పటికే మూడు నెలల ముందు తమ సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. కమ్యూనిస్టు పార్టీ, ఇతర అభ్యుదయభావాలు కలిగిన వారందరూ కలిసి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో పీడీఎఫ్ ఘన విజయం సాధించింది. అదే సమయంలో పీవీ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల అనంతరం బూర్గుల రామకృష్ణారావు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తొలి హైదరాబాద్ రాష్ట్ర సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాంతో స్వామి రామానంద తీర్ధ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి పీవీని కాంగ్రెస్ కార్యదర్శుల్లో ఒకరిగా నియమించారు.

ముఖ్యమంత్రిగా..
కాసు బ్రహ్మానందడ్డి ముఖ్యమంవూతిగా రాజీనామా చేయాల్సిన పరిస్థితులు నెలకొనడంతో తెలంగాణ ప్రాంత నాయకుడికి సీఎం పదవి ఇవ్వడంపై అధిష్ఠానం యోచిస్తున్న సమయంలోనే పీవీ వారి దృష్టిలో పడ్డారు. అప్పటికే నూకల రామచంవూదాడ్డి, జే చొక్కారావు, టీ అంజయ్యతో పాటు తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు మర్రి చెన్నాడ్డి బలమైన నేతలుగా ఉన్నారు. 1971 సెప్టెంబర్ 30న పీవీని శాసన సభాపక్ష నేతగా ఏకక్షిగీవంగా ఎన్నుకోవడంతో ముఖ్యమంవూతిగా ప్రమాణస్వీకారం చేశారు. 1972లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పీవీ మంథని నుంచి గెలుపొంది మార్చి 20న సీఎంగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1970 డిసెంబర్‌లో ముల్కీ నిబంధనలు చెల్లుబాటు అవుతాయని ఇచ్చిన తీర్పును 1972లో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం రద్దు చేసింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్ళింది. అదే ఏడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు చెల్లుబాటు అవుతాయని తీర్పునిచ్చింది. ఈ తీర్పును అమలు చేస్తే ఆంధ్రవూపాంత విద్యార్థులకు హైదరాబాద్ జంటనగరాల్లోని విద్యా సంస్థల్లో సీట్లు లభించవనే ప్రచారం జరిగింది. విద్యార్థి ఉద్యమాలు తెలంగాణ, ఆంధ్రాలో ఉవ్వెత్తున లేచాయి. రాష్ట్ర విభజన ప్రసక్తే లేదని, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని నాటి ప్రధాని ఇందిర ప్రకటించి పంచసూత్రాలను రూపొందించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ పీవీ మంత్రివర్గంలోని 9 మంది మంత్రులు పదవులకు రాజీనామాలు చేశారు. 1973 జనవరి 11న ఎనిమిది మంది మంత్రులను పీవీ తన కేబినెట్‌లో కొత్తగా చేర్చుకున్నారు. అయినప్పటికీ ఆంధ్రా నేతల ఉద్యమాన్ని ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో నాయకత్వాన్ని మార్చితే తప్ప ఉద్యమం తగ్గుముఖం పట్టదని ఇందిరకు కొందరు పెద్దలు సూచించారు. దాంతో ప్రధాని ఆదేశం మేరకు పీవీ 1973 జనవరి 17న తన పదవికి రాజీనామా చేశారు. మరుసటి రోజు నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టారు.

అంతర్జాతీయ రాజకీయాల్లో
ఇందిరాగాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా, అధికారంలో ఉన్నా, లేక పోయినా ఆమె అనుయాయుడిగా, విశ్వాస పాత్రుడిగా ఉంటూ వచ్చారు పీవీ. ఎమర్జెన్సీ తర్వాత దేశ మంతటా కాంగ్రెస్ ఓడిపోయినా.. రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. 42 స్థానాల్లో 41 స్థానాల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుందంటే పీవీనే ప్రధాన కారణమని అంటారు. ఎమ్జన్సీ తరువాత జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఆ ఎన్నికల్లోనే ఆయన హన్మకొండ నుంచి గెలుపొందారు. అప్పడు ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఆమె కేబినెట్‌లో పీవీ విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తన అసమాన రాజనీతిజ్ఞత, బహుముఖ ప్రతిభా సామర్థాన్ని అంతర్జాతీయ దౌత్యంలో ప్రదర్శించారు. 1981లో అలీన దేశాల విదేశాంగ మంత్రుల మహాసభకు పీవీ అధ్యక్షత వహించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు.

వందేమాతర ఉద్యంతోనే రాజకీయాల్లోకి
1938 అక్టోబర్‌లో ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులు వందేమాతరం గీతం ఆలపించడంతో ఆ గీతాన్ని నిషేధిస్తూ నాటి సర్కార్ సర్క్యులర్ జారీ చేసింది. విద్యార్థులు దాన్ని ఖాతరు చేయలేదు. వందేమాతరం ఆలపించే విద్యార్థులందరినీ కళాశాల నుంచి బహిష్కరిస్తున్నట్లు 1938 నవంబర్ 29న ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులను హాస్టల్ నుంచి బయటికి పంపేశారు. ఈ వార్త నిజాం సంస్థానంలోని అన్ని జిల్లాలకు పాకింది. విద్యార్థులందరూ తరగతులు బహిష్కరించారు. వరంగల్, హన్మకొండ పట్టణ విద్యార్థులకు పీవీ నేతృత్వం వహించారు. ఆ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల పేర్లను తరగతుల హాజరుపట్టీల నుంచి తొలగిస్తూ భవిష్యత్తులో వారికి ఎక్కడా అడ్మిషన్లు ఇవ్వకుండా ఆంక్షలు విధించారు. దీంతో పీవీ నాగ్‌పూర్ వెళ్ళి అక్కడి యూనివర్సిటీ నుంచి ఇంటర్‌పూర్తి చేశారు. ఆ తరువాత పుణెలోని ఫెర్గూసన్ కళాశాలలో వీఎస్సీ పూర్తి చేశారు. మళ్ళీ నాగ్‌పూర్ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చదివి స్వర్ణ పతకం సాధించారు. నాగ్‌పూర్‌లో చదివే రోజుల్లోనే సుభాష్ చంద్రబోస్‌ను కలిసి ఆటోక్షిగాఫ్ తీసుకున్నారు. న్యాయ శాస్త్రంలో పట్టాపొంది హైదరాబాద్ చేరుకుని అప్పటి ప్రముఖ న్యాయవాది బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్‌గా చేరారు.

పీవీ జీవిత ప్రస్థానం
పేరు: పాములపర్తి వెంకటనర్సింహారావు
జననం: 1921, జూన్ 28
తల్లిదంవూడులు: రంగారావు, రుక్మిణి
స్వస్థలం: భీమదేవరపల్లి, వంగర మండలం, కరీంనగర్ జిల్లా
- 1947లో కాంగ్రెస్ పార్టీలో చేరిక
- 1952లో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి బద్దం ఎల్లాడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
- 1954 నుంచి 56 వరకు జిల్లా కాంగ్రెస్ ప్రధానకార్యదర్శిగా పనిచేశారు.
- 1957 నుంచి 62 వరకు పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేశారు.
- ఆ సమయంలోనే మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 62,67,72 వరకు వరుస విజయాలను సాధించారు. సమాచార, జైళ్ళ, న్యాయశాఖమంవూతిగా పనిచేశారు.
- 1971 సెప్టెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంవూతిగా ప్రమాణం చేశారు.
- భూ సంస్కరణలచట్టం ప్రవేశపెట్టి స్వగ్రామమైన వంగరలో 1100 ఎకరాల భూమిని ప్రభుత్వానికి దారాదత్తం చేశారు.
- భూ సంస్కరణల చట్టం వల్ల సొంత పార్టీలోనే విభేదాలు తలెత్తడంతో 1973లో పీవీ గద్దె దిగాల్సి వచ్చింది.
- 1977లో హన్మకొండ లోక్‌సభ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ సమయంలోనే కేంద్ర విదేశాంగ, దేశ, వ్యవహారాల, హోంశాఖ మంత్రిగా పనిచేశారు.
- 1991లో రాజీవ్‌గాంధీ మరణాంతరం జూన్ 21న ఊహించని రీతిలో ప్రధానమంత్రి అయ్యారు.
- ప్రధానిగా నూతన పారిక్షిశామిక ఆర్థిక విధానం ప్రవేశపెట్టి దేశాన్ని ఆర్థికంగా తీర్చిదిద్దేందుకు బాటలు వేశారు.
- 2004,డిసెంబర్ 23న తుదిశ్వాస విడిచారు.

No comments:

Post a Comment