Sunday, December 25, 2011

తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన మన భానువూపకాష్

నాటక రంగం కోసం జీవితాన్ని ధారపోసిన ధన్యజీవి భానువూపకాష్. ఆయన కమర్షియల్ సినిమా రంగంలోకి వెళ్లడానికి ఎంతమాత్రం ఆసక్తి చూపలేదు. కాకపోతే, తానే చేయాలని అడిగిన మీదట చేసిన పాతిక సినిమాలు తప్పా ఆయనకు నాటకమే నిండు జీవితం....

భానువూపకాష్ తెలుగు నాటక రంగంలో ఒక గాలివానను సృష్టించారు. ఈ నేపథ్యంలో భానువూపకాష్ ‘చంవూదగుప్త’, ‘కన్యాశుల్కం’, ‘విశ్వశాంతి’, ‘సుడిగాలి’, ‘ఆపద్భాందవులు’, ‘న్యాయం’, ‘పత్తర్ కె ఆంసూ’, ‘తాజ్ కీ ఛాయామే’ వంటి నాటకాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ‘ప్రతిధ్వనులు’, ‘ప్రతిబింబాలు’, ‘వాన వెలిసింది’, ‘గాలిపటం’, ‘కాలం వెనక్కు వెళ్లింది’ వంటి నాటికల్లో ఆయన తన నటనను కూడా ప్రదర్శించి మంచి పేరు గాంచారు.


తెలుగునాట నాటక వికాసానికి అనితరంగా దోహదం చేసిన ఉదాత్త కళాకారుడు భానువూపకాష్. ప్రధానంగా హైదరాబాదు రాష్ట్రంలో సాంఘిక నాటకానికి బీజావాహన చేసింది ఈయనే. నాటకకళ పురోభివృద్ధికి పట్టుకొమ్మగా నిలిచిన భానుప్రకాష్ చివరకు చిల్లిగవ్వయినా మిగుల్చు కోకుండా తనువు చాలించడం ఆయన ప్రగాఢ అంకితభావానికి నిదర్శనం.
భానువూపకాష్ పేరు చెప్పగానే పాతతరం నాటక ప్రియులకు ‘గాలివాన ’, ‘జీవన్నాటకం’, ‘ఒంటి కాలి పురుగు’, ‘గాలి గోపురం’, ‘బాపూ బాటలో’ వంటి నాటకాలు గుర్తుకు వస్తాయి. నాటకరంగ సేవలోనే తన నిజ జీవితాన్ని కూడా పరిపూర్ణంగా పండించుకొన్న ధన్యజీవి ఆయన. ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘బుద్ధిమంతుడు’, ‘ఆత్మీయులు’, ‘భక్త తుకారాం’, ‘ముద్దులకొడుకు’, ‘రాధాకృష్ణ’, ‘చిల్లరదేవుళ్లు’, ‘దయామయుడు’ తదితర రెండు డజన్లకు పైగా సినిమాలలోనూ నటించారాయన.

అటు నటనతో, ఇటు నాటకాలకు దర్శకత్వంతో అనేక అవార్డులు అందుకున్న భానువూపకాష్ అచ్చమైన మన తెలంగాణ బిడ్డ. ఆయన పూర్తి పేరు బొల్లంపల్లి భానువూపకాష్‌రావు. నల్లగొండలో వెంకటహరి, అండాలమ్మ దంపతులకు 1939 ఏప్రిల్ 21న జన్మించారు.
భానువూపకాష్ ఇంట్లో సాంస్కృతిక వాతావరణం అన్నదే ఉండేది కాదు. అయినా, సొంత అభిరుచితో కళారంగం వైపు దృష్టి మళ్లించారు. ఆయన మేనమామ ధరణి శ్రీనివాసరావు మాత్రం ప్రసిద్ధ్ద నాటక రచయిత. భానువూపకాష్ కేశవ్ మెమోరియల్ స్కూల్లో చదువుతుండగానే తొలిసారిగా వార్షికోత్సవాల సందర్భంగా స్టేజీపై నటించారు. ఆ తొలి నాటకం పేరు ‘తార్‌మార్’. ఇందులో భాను మంచి వేషం వేశారు. అందులోని బాల భాను నటన అందరికీ నచ్చింది. ప్రిన్సిపాల్ ఒక మొమెంటోతో ప్రశంసించారు. దాంతో భాను నటనపట్ల తనలోని ఆసక్తిని మరింత పెంచుకున్నారు.

తమ కాలనీలోని మిత్రులను ఒకచోట చేర్చి తానే నాటకాలు రూపొందించి వినాయకచవితి మండపాల్లో వాటిని ప్రదర్శించడం ప్రారంభించారు. అప్పట్లోనే హైదరాబాదులో ఎస్8. కె. ఆంజనేయులు అనే నాటక ప్రయోక్త సహజం నిర్వహించే ‘విసృతి’ నాట్యమండలి వారి నాటకాలు, వారి రిహార్సల్స్‌ని శ్రద్ధగా, దగ్గర్నించి పరిశీలించేవారు. అదే తనకు ప్రేరణనిచ్చింది. ఎలాగైతేనేం, తాను కూడా నాటకాలకు దర్శకత్వం వహించాలన్న నిర్ణయానికి వచ్చారు.

సైఫాబాద్ సైన్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఇంటర్ కాలేజీస్థాయి నాటక పోటీలు జరిగాయి. అందులో వారి కళాశాల నుండి భీంసేన్ రావ్ దర్శకత్వంలో ‘డాక్టర్ యజ్ఞం’ నాటికను వేయడానికి నటీనటుల ఎంపిక జరుగుతోంది. అందులో భానువూపకాష్‌కి ఏదైనా వేషం వేయాలనిపించింది. మొత్తం 30 మంది పోటీదారుల్లో తాను ఎంపికవుతానో లేనో అనుకున్నాడు. కానీ, చివరికి భీంసేన్ రావ్ భానుని పిలిచి డా॥ యజ్ఞం పాత్ర డైలాగ్‌ను చెప్పించుకున్నాడు. మూడు రోజుల తర్వాత అందులోని ఆ ప్రధాన పాత్ర (డా॥ యజ్ఞం) కోసం భానువూపకాష్ ఎంపికైనట్లు ప్రకటించారు. ఇది తనకు ఊహించని అవకాశం. అయితే, భాను దానిని ఊరికే పోనీయలేదు. చక్కగా సకాలానికి ఉపయోగించుకున్నారు. రిహార్సల్స్‌కి ముందు భీంసేన్ రావ్ సెలవులో వెళ్లవలసి రావడంతో దర్శకత్వ బాధ్యతలను ఆయన భానుకి అప్పగించి వెళ్లారు. పూర్వానుభవం ఏమీ లేకున్నా ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. తిరిగి వచ్చిన భీంసేన్ నటులకు లభించిన తర్ఫీదును చూసి ఆశ్చర్యపోయారు. భానును ఆనందంతో అలింగనం చేసుకున్నారు. ఆ నాటిక అద్భుతంగా రాణించింది. దానికి బహుమతులూ వచ్చాయి. ఇలా తొలి అడుగులోనే విజయం సాధించారు.
తర్వాత తెలుగు సంగీత, నాటకరంగంలో భానువూపకాష్ వెనుతిరిగి చూడనే లేదు. ‘గాలివాన’, ‘గుడిగంటలు’, ‘గాలిపటం’, ‘ శ్రీమాన్ శ్రీమతి’ వంటి నాటకాలలో నటిస్తూ, దర్శకత్వం వహించాడు. 1964లో ‘యాచకులు’లో భానువూపకాష్ ప్రదర్శించిన నటనను విమర్శకులు సైతం మెచ్చుకున్నారు.

‘హైదరాబాదులో పుట్టినతనికి ఇంత చక్కటి ఉచ్చారణ రావడం గ్రేట్’ అని వారు ఆశ్చర్య పడ్డారు. భానువూపకాష్ స్వయంగా ‘కళారాధన’ సంస్థను స్థాపించారు. దాని ఆధ్వర్యంలో ‘వలయం’, ‘ గాలివాన’, ‘ కెరటాలు’ వంటి నాటకాలు ప్రదర్శించారు. ఆ రోజుల్లో ఈ సంస్థను ‘గ్రేట్ ఈస్ట్రన్ సర్కస్8 కంపెని’ అని గొప్పగా పిలిచేవారు. కారణం, ఇందులోని కళాకారులు మెరుపు వేగంతో నటనా వైవిధ్యాన్ని ప్రదర్శించేవారు. ఏ నాటకమైనా ఒక ఉప్పెనలా సాగేది. పాత్రలతో ప్రేక్షకులు లీనమై పోయేవారు. ఫలితంగా ఎన్నో ప్రశంసలు.

భానువూపకాష్ తెలుగు నాటక రంగంలో ఒక గాలివానను సృష్టించారు. ఈ నేపథ్యంలో భానువూపకాష్ ‘చంవూదగుప్త’, ‘కన్యాశుల్కం’, ‘విశ్వశాంతి’, ‘సుడిగాలి’, ‘ఆపద్భాందవులు’, ‘న్యాయం’, ‘పత్తర్ కె ఆంసూ’, ‘తాజ్ కీ ఛాయామే’ వంటి నాటకాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ‘ప్రతిధ్వనులు’, ‘ప్రతిబింబాలు’, ‘వాన వెలిసింది’, ‘గాలిపటం’, ‘కాలం వెనక్కు వెళ్లింది’ వంటి నాటికల్లో ఆయన తన నటనను కూడా ప్రదర్శించి మంచి పేరు గాంచారు.
నాటకం, నాటిక ఏదైనా సరే ఆయన దర్శకత్వంలో రూపొందిందంటే అందులో నవరసాలు ఉంటాయన్న పేరుంది. అయితే, భానుప్రకాష్ నటనలో మాత్రం మెలోవూడామా పాళ్లు అధికమని నాటక పరిశీలకులు అభివూపాయపడతారు.

ఒకసారి ‘చీకటి కోణాలు’ నాటకంలో భానువూపకాష్ నటనను స్థానం వారు అభినందించారు. ఇంకా ‘ఆకాశవాణి’లో కూడా ఆయన ‘ఏ గ్రేడ్’ ఆర్టిస్టుగా చాలా నాటకాల్లో పాల్గొన్నారు. ఢిల్లీ, మద్రాస్8, కలకత్తా, కాన్పూర్‌లలో నాటకాలను ప్రదర్శించి పలువురి మెప్పు పొందారు.
ఇలా రంగస్థలంపైనే గాక సినిమాల్లోనూ భానువూపకాష్ పలు పాత్రలు పోషించారు. కాకపోతే, తన ప్రథమ ప్రాధాన్యం నాటకాలకే ఇచ్చారు. సినీ పాత్రలలోనూ తనదైన విలక్షణతను ప్రదర్శించారు. సాధారణంగా ఎవ్వరైనా సినిమాల్లో పాత్రల కోసం వెంట పడుతుంటారు. కానీ, కొన్ని పాత్రలు పోషించడానికి సినిమా రంగమే ఆయన వెంట పడటం విశేషం.

మొదటి నుండి నాటకాలకే పూర్తికాలం పనిచేసే ఆయనకు సినిమాలవైపు మళ్లాలన్న ఆలోచనే రాలేదు. ఒకసారి ఆయన నాటకాన్ని చూసిన నిర్మాత దుక్కిపాటి మధుసూదన్‌రావు తొలుత తన ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాలో ఒక చిన్న పాత్రను ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఆయనే ‘పూలరంగడు’లో ఎలాంటి టెస్టు లేకుండానే పూర్తి నిడివి పాత్రను ఇచ్చారు. ఇందులోఆయన తనదైన విభిన్నమైన విలనీని చూపారాయన. పెద్ద నటులు చాలామందే ఉన్న ఈ సినిమాలో తన నాటకానుభవంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారాయన. ‘నాకు రంగస్థలంపైనే తొలి ప్రేమ. తీరుబడి దొరికితే తప్ప సినిమాలవైపు చూడను’ అనే వారాయన. నాటక రంగం పట్ల ఆయనకున్న అభిలాషకు, నిబద్దతకు ఇది నిదర్శనం.
50 ఏళ్లకు పైగా రంగస్థల, సినీ రంగాలకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి. ‘సుడిగాలి’, ‘గాలివాన’, ‘కెరటాలు’ నాటకాలకు ఉత్తమ దర్శకుడిగా వరుసగా మూడుసార్లు ఎంపికై ‘రోలింగ్ షీల్డ్’ అందుకున్నారు. 1972లో మరో రెండు బంగారు పతకాలను, 1974లో ‘బళ్లారి రాఘవ’ అవార్డుతో వెండి కిరీటం పొందారు. ‘యువ కళావాహిని’ సంస్థ కె.వేంక అవార్డు, తెలుగు యూనివర్సిటి ఉత్తమ నటుడి అవార్డు, ఎ.ఆర్.కృష్ణ స్మారక పురస్కారం, 1988లో ఉగాది పురస్కారం, జూలూరు వీరేశలింగం అవార్డు, కిన్నెర ఉగాది పురస్కారం, నాటక కృషీవలుడు పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం వంటివి ఎన్నో ఆయనను వరించాయి.

జీవితమంతా నాటకంగా, నాటకమే జీవితంగా గడిపిన ఈ అద్భుత కళాకారుడు తన మొత్తం జీవిత కాలంలో రోజుకు గంటసేపు కూడా కుటుంబానికి కేటాయించలేదంటే ఆశ్చర్యమే. అలా చివరి దాకా నాట రంగం కోసం తపిస్తూనే 2009 జూన్ 6న తన 70వ యేట తనువు చాలించారు. హెచ్.ఎ.ఎల్.లో ఉద్యోగం చేసినా భానుప్రకాష్ చివరికి ఒక్క రూపాయైనా మిగుల్చుకోలేదని ఆయన సన్నిహితులు అంటారు. కనీసం పెన్షన్ అయినా లేకుండానే చివరి రోజులు గడిపారు. తెలంగాణ గర్వించదగ్గ ఈ కళాకారుడిది తెలుగు నాటక రంగ చరివూతలోనే అద్వితీయమైన స్థానం.

‘చివరి శ్వాస వరకు నాటకం కోసమే’
భానుప్రకాష్ సతీమణి శ్రీమతి సరస్వతి
భానువూపకాష్ సహధర్మచారిణి సరస్వతి హైదరాబాద్‌లోని నల్లకుంటలో నివాసముంటున్నారు. ‘బతుకమ్మ’ కోసం ఈ రచయిత ఆమెను పలకరించగా ఆమె ఒకింత ఉద్వేగానికి లోనైనారు.
‘‘ఆ మనిషి , మనసు రెండూ నాటకం కోసమే అన్నట్లు జీవించారు. 11 ఏళ్ల వయస్సులోనే రంగస్థలంపై వేషం వేశారు. మా వదినగారి అన్న కావడం వల్ల పెళ్లికి ముందే ఆయనను నటుడిగా స్టేజీపై చూశాను. ఆయన నటించిన నాటకాల్లో ‘చీకటి కోణాలు’లోని నటన నాకు చాలా ఇష్టం’’ అని ఆమె అన్నారు.
‘‘సినిమాల్లో వేషాలకోసం ఆయన ఏనాడూ ఎవ్వరినీ అర్థించలేదు. సినిమా వాళ్లే కొన్ని పాత్రలకు వీరైతైనే సరిపోతారని గుర్తించి అవకాశం ఇచ్చారు’’ అన్నారామె.
‘‘అహోరావూతులు నాటకాలంటూ తిరిగే వారాయన. పెళ్లైన కొత్తలోనే నెలల తరబడి నాటకాలకోసం ఊర్లు పట్టుకొని తిరిగేవారు. చనిపోవడానికి వారం రోజులు ముందు కూడా నాటకాల పనిమీదే వరంగల్, భద్రాచలం వెళ్లి వచ్చారు. చివరి శ్వాసదాకా నాటకాల గురించే ఆలోచించారు’’ అన్న ఆమె మాటలు నిజంగానే అక్షరసత్యాలు.

తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన మన భానువూపకాష్

నాటక రంగం కోసం జీవితాన్ని ధారపోసిన ధన్యజీవి భానువూపకాష్. ఆయన కమర్షియల్ సినిమా రంగంలోకి వెళ్లడానికి ఎంతమాత్రం ఆసక్తి చూపలేదు. కాకపోతే, తానే చేయాలని అడిగిన మీదట చేసిన పాతిక సినిమాలు తప్పా ఆయనకు నాటకమే నిండు జీవితం....

భానువూపకాష్ తెలుగు నాటక రంగంలో ఒక గాలివానను సృష్టించారు. ఈ నేపథ్యంలో భానువూపకాష్ ‘చంవూదగుప్త’, ‘కన్యాశుల్కం’, ‘విశ్వశాంతి’, ‘సుడిగాలి’, ‘ఆపద్భాందవులు’, ‘న్యాయం’, ‘పత్తర్ కె ఆంసూ’, ‘తాజ్ కీ ఛాయామే’ వంటి నాటకాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ‘ప్రతిధ్వనులు’, ‘ప్రతిబింబాలు’, ‘వాన వెలిసింది’, ‘గాలిపటం’, ‘కాలం వెనక్కు వెళ్లింది’ వంటి నాటికల్లో ఆయన తన నటనను కూడా ప్రదర్శించి మంచి పేరు గాంచారు.


తెలుగునాట నాటక వికాసానికి అనితరంగా దోహదం చేసిన ఉదాత్త కళాకారుడు భానువూపకాష్. ప్రధానంగా హైదరాబాదు రాష్ట్రంలో సాంఘిక నాటకానికి బీజావాహన చేసింది ఈయనే. నాటకకళ పురోభివృద్ధికి పట్టుకొమ్మగా నిలిచిన భానుప్రకాష్ చివరకు చిల్లిగవ్వయినా మిగుల్చు కోకుండా తనువు చాలించడం ఆయన ప్రగాఢ అంకితభావానికి నిదర్శనం.
భానువూపకాష్ పేరు చెప్పగానే పాతతరం నాటక ప్రియులకు ‘గాలివాన ’, ‘జీవన్నాటకం’, ‘ఒంటి కాలి పురుగు’, ‘గాలి గోపురం’, ‘బాపూ బాటలో’ వంటి నాటకాలు గుర్తుకు వస్తాయి. నాటకరంగ సేవలోనే తన నిజ జీవితాన్ని కూడా పరిపూర్ణంగా పండించుకొన్న ధన్యజీవి ఆయన. ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘బుద్ధిమంతుడు’, ‘ఆత్మీయులు’, ‘భక్త తుకారాం’, ‘ముద్దులకొడుకు’, ‘రాధాకృష్ణ’, ‘చిల్లరదేవుళ్లు’, ‘దయామయుడు’ తదితర రెండు డజన్లకు పైగా సినిమాలలోనూ నటించారాయన.

అటు నటనతో, ఇటు నాటకాలకు దర్శకత్వంతో అనేక అవార్డులు అందుకున్న భానువూపకాష్ అచ్చమైన మన తెలంగాణ బిడ్డ. ఆయన పూర్తి పేరు బొల్లంపల్లి భానువూపకాష్‌రావు. నల్లగొండలో వెంకటహరి, అండాలమ్మ దంపతులకు 1939 ఏప్రిల్ 21న జన్మించారు.
భానువూపకాష్ ఇంట్లో సాంస్కృతిక వాతావరణం అన్నదే ఉండేది కాదు. అయినా, సొంత అభిరుచితో కళారంగం వైపు దృష్టి మళ్లించారు. ఆయన మేనమామ ధరణి శ్రీనివాసరావు మాత్రం ప్రసిద్ధ్ద నాటక రచయిత. భానువూపకాష్ కేశవ్ మెమోరియల్ స్కూల్లో చదువుతుండగానే తొలిసారిగా వార్షికోత్సవాల సందర్భంగా స్టేజీపై నటించారు. ఆ తొలి నాటకం పేరు ‘తార్‌మార్’. ఇందులో భాను మంచి వేషం వేశారు. అందులోని బాల భాను నటన అందరికీ నచ్చింది. ప్రిన్సిపాల్ ఒక మొమెంటోతో ప్రశంసించారు. దాంతో భాను నటనపట్ల తనలోని ఆసక్తిని మరింత పెంచుకున్నారు.

తమ కాలనీలోని మిత్రులను ఒకచోట చేర్చి తానే నాటకాలు రూపొందించి వినాయకచవితి మండపాల్లో వాటిని ప్రదర్శించడం ప్రారంభించారు. అప్పట్లోనే హైదరాబాదులో ఎస్8. కె. ఆంజనేయులు అనే నాటక ప్రయోక్త సహజం నిర్వహించే ‘విసృతి’ నాట్యమండలి వారి నాటకాలు, వారి రిహార్సల్స్‌ని శ్రద్ధగా, దగ్గర్నించి పరిశీలించేవారు. అదే తనకు ప్రేరణనిచ్చింది. ఎలాగైతేనేం, తాను కూడా నాటకాలకు దర్శకత్వం వహించాలన్న నిర్ణయానికి వచ్చారు.

సైఫాబాద్ సైన్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఇంటర్ కాలేజీస్థాయి నాటక పోటీలు జరిగాయి. అందులో వారి కళాశాల నుండి భీంసేన్ రావ్ దర్శకత్వంలో ‘డాక్టర్ యజ్ఞం’ నాటికను వేయడానికి నటీనటుల ఎంపిక జరుగుతోంది. అందులో భానువూపకాష్‌కి ఏదైనా వేషం వేయాలనిపించింది. మొత్తం 30 మంది పోటీదారుల్లో తాను ఎంపికవుతానో లేనో అనుకున్నాడు. కానీ, చివరికి భీంసేన్ రావ్ భానుని పిలిచి డా॥ యజ్ఞం పాత్ర డైలాగ్‌ను చెప్పించుకున్నాడు. మూడు రోజుల తర్వాత అందులోని ఆ ప్రధాన పాత్ర (డా॥ యజ్ఞం) కోసం భానువూపకాష్ ఎంపికైనట్లు ప్రకటించారు. ఇది తనకు ఊహించని అవకాశం. అయితే, భాను దానిని ఊరికే పోనీయలేదు. చక్కగా సకాలానికి ఉపయోగించుకున్నారు. రిహార్సల్స్‌కి ముందు భీంసేన్ రావ్ సెలవులో వెళ్లవలసి రావడంతో దర్శకత్వ బాధ్యతలను ఆయన భానుకి అప్పగించి వెళ్లారు. పూర్వానుభవం ఏమీ లేకున్నా ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. తిరిగి వచ్చిన భీంసేన్ నటులకు లభించిన తర్ఫీదును చూసి ఆశ్చర్యపోయారు. భానును ఆనందంతో అలింగనం చేసుకున్నారు. ఆ నాటిక అద్భుతంగా రాణించింది. దానికి బహుమతులూ వచ్చాయి. ఇలా తొలి అడుగులోనే విజయం సాధించారు.
తర్వాత తెలుగు సంగీత, నాటకరంగంలో భానువూపకాష్ వెనుతిరిగి చూడనే లేదు. ‘గాలివాన’, ‘గుడిగంటలు’, ‘గాలిపటం’, ‘ శ్రీమాన్ శ్రీమతి’ వంటి నాటకాలలో నటిస్తూ, దర్శకత్వం వహించాడు. 1964లో ‘యాచకులు’లో భానువూపకాష్ ప్రదర్శించిన నటనను విమర్శకులు సైతం మెచ్చుకున్నారు.

‘హైదరాబాదులో పుట్టినతనికి ఇంత చక్కటి ఉచ్చారణ రావడం గ్రేట్’ అని వారు ఆశ్చర్య పడ్డారు. భానువూపకాష్ స్వయంగా ‘కళారాధన’ సంస్థను స్థాపించారు. దాని ఆధ్వర్యంలో ‘వలయం’, ‘ గాలివాన’, ‘ కెరటాలు’ వంటి నాటకాలు ప్రదర్శించారు. ఆ రోజుల్లో ఈ సంస్థను ‘గ్రేట్ ఈస్ట్రన్ సర్కస్8 కంపెని’ అని గొప్పగా పిలిచేవారు. కారణం, ఇందులోని కళాకారులు మెరుపు వేగంతో నటనా వైవిధ్యాన్ని ప్రదర్శించేవారు. ఏ నాటకమైనా ఒక ఉప్పెనలా సాగేది. పాత్రలతో ప్రేక్షకులు లీనమై పోయేవారు. ఫలితంగా ఎన్నో ప్రశంసలు.

భానువూపకాష్ తెలుగు నాటక రంగంలో ఒక గాలివానను సృష్టించారు. ఈ నేపథ్యంలో భానువూపకాష్ ‘చంవూదగుప్త’, ‘కన్యాశుల్కం’, ‘విశ్వశాంతి’, ‘సుడిగాలి’, ‘ఆపద్భాందవులు’, ‘న్యాయం’, ‘పత్తర్ కె ఆంసూ’, ‘తాజ్ కీ ఛాయామే’ వంటి నాటకాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ‘ప్రతిధ్వనులు’, ‘ప్రతిబింబాలు’, ‘వాన వెలిసింది’, ‘గాలిపటం’, ‘కాలం వెనక్కు వెళ్లింది’ వంటి నాటికల్లో ఆయన తన నటనను కూడా ప్రదర్శించి మంచి పేరు గాంచారు.
నాటకం, నాటిక ఏదైనా సరే ఆయన దర్శకత్వంలో రూపొందిందంటే అందులో నవరసాలు ఉంటాయన్న పేరుంది. అయితే, భానుప్రకాష్ నటనలో మాత్రం మెలోవూడామా పాళ్లు అధికమని నాటక పరిశీలకులు అభివూపాయపడతారు.

ఒకసారి ‘చీకటి కోణాలు’ నాటకంలో భానువూపకాష్ నటనను స్థానం వారు అభినందించారు. ఇంకా ‘ఆకాశవాణి’లో కూడా ఆయన ‘ఏ గ్రేడ్’ ఆర్టిస్టుగా చాలా నాటకాల్లో పాల్గొన్నారు. ఢిల్లీ, మద్రాస్8, కలకత్తా, కాన్పూర్‌లలో నాటకాలను ప్రదర్శించి పలువురి మెప్పు పొందారు.
ఇలా రంగస్థలంపైనే గాక సినిమాల్లోనూ భానువూపకాష్ పలు పాత్రలు పోషించారు. కాకపోతే, తన ప్రథమ ప్రాధాన్యం నాటకాలకే ఇచ్చారు. సినీ పాత్రలలోనూ తనదైన విలక్షణతను ప్రదర్శించారు. సాధారణంగా ఎవ్వరైనా సినిమాల్లో పాత్రల కోసం వెంట పడుతుంటారు. కానీ, కొన్ని పాత్రలు పోషించడానికి సినిమా రంగమే ఆయన వెంట పడటం విశేషం.

మొదటి నుండి నాటకాలకే పూర్తికాలం పనిచేసే ఆయనకు సినిమాలవైపు మళ్లాలన్న ఆలోచనే రాలేదు. ఒకసారి ఆయన నాటకాన్ని చూసిన నిర్మాత దుక్కిపాటి మధుసూదన్‌రావు తొలుత తన ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాలో ఒక చిన్న పాత్రను ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఆయనే ‘పూలరంగడు’లో ఎలాంటి టెస్టు లేకుండానే పూర్తి నిడివి పాత్రను ఇచ్చారు. ఇందులోఆయన తనదైన విభిన్నమైన విలనీని చూపారాయన. పెద్ద నటులు చాలామందే ఉన్న ఈ సినిమాలో తన నాటకానుభవంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారాయన. ‘నాకు రంగస్థలంపైనే తొలి ప్రేమ. తీరుబడి దొరికితే తప్ప సినిమాలవైపు చూడను’ అనే వారాయన. నాటక రంగం పట్ల ఆయనకున్న అభిలాషకు, నిబద్దతకు ఇది నిదర్శనం.
50 ఏళ్లకు పైగా రంగస్థల, సినీ రంగాలకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి. ‘సుడిగాలి’, ‘గాలివాన’, ‘కెరటాలు’ నాటకాలకు ఉత్తమ దర్శకుడిగా వరుసగా మూడుసార్లు ఎంపికై ‘రోలింగ్ షీల్డ్’ అందుకున్నారు. 1972లో మరో రెండు బంగారు పతకాలను, 1974లో ‘బళ్లారి రాఘవ’ అవార్డుతో వెండి కిరీటం పొందారు. ‘యువ కళావాహిని’ సంస్థ కె.వేంక అవార్డు, తెలుగు యూనివర్సిటి ఉత్తమ నటుడి అవార్డు, ఎ.ఆర్.కృష్ణ స్మారక పురస్కారం, 1988లో ఉగాది పురస్కారం, జూలూరు వీరేశలింగం అవార్డు, కిన్నెర ఉగాది పురస్కారం, నాటక కృషీవలుడు పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం వంటివి ఎన్నో ఆయనను వరించాయి.

జీవితమంతా నాటకంగా, నాటకమే జీవితంగా గడిపిన ఈ అద్భుత కళాకారుడు తన మొత్తం జీవిత కాలంలో రోజుకు గంటసేపు కూడా కుటుంబానికి కేటాయించలేదంటే ఆశ్చర్యమే. అలా చివరి దాకా నాట రంగం కోసం తపిస్తూనే 2009 జూన్ 6న తన 70వ యేట తనువు చాలించారు. హెచ్.ఎ.ఎల్.లో ఉద్యోగం చేసినా భానుప్రకాష్ చివరికి ఒక్క రూపాయైనా మిగుల్చుకోలేదని ఆయన సన్నిహితులు అంటారు. కనీసం పెన్షన్ అయినా లేకుండానే చివరి రోజులు గడిపారు. తెలంగాణ గర్వించదగ్గ ఈ కళాకారుడిది తెలుగు నాటక రంగ చరివూతలోనే అద్వితీయమైన స్థానం.

‘చివరి శ్వాస వరకు నాటకం కోసమే’
భానుప్రకాష్ సతీమణి శ్రీమతి సరస్వతి
భానువూపకాష్ సహధర్మచారిణి సరస్వతి హైదరాబాద్‌లోని నల్లకుంటలో నివాసముంటున్నారు. ‘బతుకమ్మ’ కోసం ఈ రచయిత ఆమెను పలకరించగా ఆమె ఒకింత ఉద్వేగానికి లోనైనారు.
‘‘ఆ మనిషి , మనసు రెండూ నాటకం కోసమే అన్నట్లు జీవించారు. 11 ఏళ్ల వయస్సులోనే రంగస్థలంపై వేషం వేశారు. మా వదినగారి అన్న కావడం వల్ల పెళ్లికి ముందే ఆయనను నటుడిగా స్టేజీపై చూశాను. ఆయన నటించిన నాటకాల్లో ‘చీకటి కోణాలు’లోని నటన నాకు చాలా ఇష్టం’’ అని ఆమె అన్నారు.
‘‘సినిమాల్లో వేషాలకోసం ఆయన ఏనాడూ ఎవ్వరినీ అర్థించలేదు. సినిమా వాళ్లే కొన్ని పాత్రలకు వీరైతైనే సరిపోతారని గుర్తించి అవకాశం ఇచ్చారు’’ అన్నారామె.
‘‘అహోరావూతులు నాటకాలంటూ తిరిగే వారాయన. పెళ్లైన కొత్తలోనే నెలల తరబడి నాటకాలకోసం ఊర్లు పట్టుకొని తిరిగేవారు. చనిపోవడానికి వారం రోజులు ముందు కూడా నాటకాల పనిమీదే వరంగల్, భద్రాచలం వెళ్లి వచ్చారు. చివరి శ్వాసదాకా నాటకాల గురించే ఆలోచించారు’’ అన్న ఆమె మాటలు నిజంగానే అక్షరసత్యాలు.

Friday, December 9, 2011

గొలుసు ‘కొట్టు’.. సూపర్ హిట్టు!.

December 3rd, 2011, ab
కలిసికట్టుగా కృషి చేస్తే గడ్డిపోచలు మదపుటేనుగును సైతం బంధించగలవు... ఇది ఒకప్పటి సూక్తి. ఇప్పుడు ఇదే మన కార్పొరేట్ వ్యాపార సూత్రమైకూర్చుంది. ఒక్కచోట.. ఒక్క దుకాణం పెట్టుకు కూర్చుంటే ఫలితం లేదు.
ఊరూరా.. వాడవాడలా.. లెక్కకు మిక్కిలిగా, శాఖోపశాఖలుగా సంస్థలు విస్తరించితేనే వ్యాపారం అంతకు అంతై..అంతంతై అన్నట్లు వర్థిల్లుతుంది. ఇప్పుడంతా గొలుసుకట్టు సంగతులే. అదే..చైన్ సిస్టమ్. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో విస్తరించడమే ఇప్పుడు వ్యాపారాల విజయ సూత్రమైపోయింది.
చైన్ స్టోర్‌లు అన్నది ఫ్యాషనై కూర్చుంది. ఇది ఏదో ఒక్క వ్యాపారానికి మాత్రమే పరిమితం కాలేదు. విద్య, వైద్య, ఎలక్ట్రానిక్స్, గ్రోసరీ, గోల్డ్, క్లాత్, రెడీమేడ్, లీజర్, స్టేషనరీ ఇలా అన్ని విభాగాల్లోనూ ఇదే తరహా నడుస్తోందిప్పుడు.
ఒకప్పుడు వేల పెట్టుబడితో నడిచే వ్యాపారాలన్నీ ఇప్పుడు కోట్ల స్థాయికి చేరాయంటే ఇది ఈ గొలుసు సంస్థల పుణ్యమే.
మనదేశంలో ఒకప్పుడు గొలుసు సంస్థలు అంటూ వుంటే అది కేవలం పెట్రోలు బంకులు మాత్రమే. అయితే అదీ కమీషన్ తరహాగా నడిచే వ్యాపారం. తొలిసారిగా రిలయన్స్, బాంబే డైయింగ్ సంస్థలు దేశవ్యాప్తంగా దుస్తుల వ్యాపారానికి శ్రీకారం చుట్టాయి. బాంబేడైయింగ్ సంస్థ అదే పేరుకి ముందు డీలర్ పేరు చేర్చి వ్యాపారం సాగిస్తే, రిలయన్స్ మంగళదీప్ పేరిట షోరూమ్‌లు ఏర్పాటు చేసింది.
ఆనాటి నుంచి ఈ నాటి వరకు పేరు మారినా విమల్ షోరూమ్‌లు ప్రతి చోటా వుండనే వున్నాయి. ఆ తరువాత దేశవ్యాప్తంగా చైన్ స్టోర్‌లుగా చెప్పుకోదగినది బాటా. దేశంలోని ప్రతి పట్టణంలో బాటా దుకాణం వుండి తీరేంతగా చైన్‌ను విస్తరింపచేసిందా సంస్థ. ఈ పరిస్థితి ఇలా నిలకడగా వున్న తరుణంలో గ్లోబలైజేషన్ పుణ్యమా అని వివిధ అంతర్జాతీయ సంస్థల కన్ను భారతీయ మార్కెట్‌పై పడింది. భారతదేశం అతి పెద్ద వినిమయ మార్కెట్‌గా వారికి కనిపించింది. అదే సమయంలో భారతదేశంలోని పెద్ద సంస్థలూ అదే రీతిగా ఆలోచించాయి. బ్రాండింగ్, గుడ్‌విల్, భారీ ఎత్తు అమ్మకాల ద్వారా, మార్జిన్ తక్కువగా వున్నా, లాభాలు ఎక్కువగా ఆర్జించవచ్చన్న కొత్త థియరీకి అంకురార్పణ చేసాయి. భారీ కొనుగోళ్లు, భారీ అమ్మకాలు, భారీ డిస్కౌంట్లు అన్న మూడు సూత్రాలపై ఈ చైన్ స్టోర్లు ఆకర్షణను సంతరించుకుంటున్నాయి. చైన్ స్టోర్ల పోటీ తట్టుకునేంతగా స్థానిక చిన్న వ్యాపారాలు లేకున్నా, ఎగువ తరగతికి చెందిన వారు మాత్రం కేవలం కొంత పరిథికి లోబడి గొలుసువ్యాపారానికి దిగి వీటికి గట్టిపోటీ ఇవ్వగలుగుతున్నారు. మరో పక్క జనం కూడా వివిధ కారణాల రీత్యా ఇటువంటి సంస్థల వైపే మొగ్గుచూపుతున్నారు.
మునుపు వినియోగదారుల అవసరాన్ని సొమ్ము చేసుకోవడం వ్యాపార లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు వినియోగదారులకు సౌకర్యాలను సమకూర్చడం ద్వారా లాభార్జన చేయడం వ్యాపారనీతిగా మారింది. సరుకులతో పాటు సౌకర్యాన్ని, సేవలతో పాటు సమయాన్ని అంద చేయడం ద్వారా వ్యాపారవృద్ధికి పలు సంస్థలు కృషిచేస్తున్నాయి. మొదట్లో వ్యాపారవృద్దికోసం ఒకే పట్టణంలో రెండు మూడు శాఖలను ఏర్పాటు చేసేవారు. ఇప్పుడది పలు నగరాలకు, రాష్ట్రాలకు విస్తరించడం వల్ల అది చైన్ స్టోర్స్‌గా మారింది. వినియోగదారుల అవసరాన్ని సొమ్ముచేసుకోవడమే వ్యాపారం. సమాజంలో వస్తున్న సాంకేతిక మార్పులు జన జీవన విధానంలో వస్తున్న మార్పుల కారణంగా వ్యాపారం కొత్తపుంతలు తొక్కుతోంది.
మొదట దుకాణాలకే పరిమితమైన వస్తువులు ఇప్పుడు వీధుల్లోకి వచ్చాయి. గతంలో వీధుల్లో అమ్మిన సరుకులు ఇప్పుడు పెద్ద పెద్ద దుకాణాలలో దర్శనమిస్తున్నాయి. తక్కువ మార్జిన్లు వేసుకుని అమ్మినా ఎక్కువ టర్నోవర్ ద్వారా మునుపటివలె లాభాలు ఆర్జించేందుకు వ్యాపారులు ఇష్టపడుతున్నారు. ఇది కేవలం సరుకుల దుకాణాలకే పరిమితం కాలేదు. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు మీ అవసరాలకు సౌకర్యాన్ని జోడించి సేవలందించే సంస్థలు చాలా వెలిశాయి. అలా తమ శాఖలను పెంచుకుంటూ పోతున్న సంస్థలు అనకాపల్లి నుంచి ఆమెరికా దాకా, చిదంబరం నుంచి షికాగో దాకా తమ శాఖలను తెరుస్తున్నాయి. ఆ శాఖలనే చైన్ స్టోర్స్ అంటున్నారు. పచ్చళ్ల నుంచి పత్రికల దాకా, వస్త్రాల నుంచి చెప్పుల దాకా ఇప్పుడు అన్నిరకాల చెయిన్ స్టోర్స్ ఏర్పాటవుతున్నాయి. ఇది అది కాకుండా ఏ వస్తువునైనా అమ్మే స్టోర్స్, పలురకాల సేవలందించే సంస్థలు వెలుస్తున్నాయి. వౌలికంగా చూస్తే ఒకే బ్రాండ్‌తో కేంద్రీకృత యాజమాన్యంలో సరుకుల రిటైల్ అమ్మకాలు జరిపే అవుట్‌లెట్ల సముదాయాన్ని చైన్ స్టోర్స్ అంటారు. ఇది సరకులమ్మే దుకాణాలకే కాదు చైన్ రెస్టారెంట్లు, కొన్ని ప్రత్యేక సేవలు అందించే సంస్థల వ్యాపారాలకూ వర్తిస్తుంది.
సొంతంగా తమ శాఖను తెరవనప్పుడు అనుబంధంగా ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసినా అవి చైన్ స్టోర్స్ అవుతాయి. ఆయా కంపెనీల ఉత్పత్తుల ప్రాతిపదికగా వివిధ రకాల చెయిన్ స్టోర్స్ ఉంటాయి. ఓ వ్యాపార చెయిన్ వివిధ చోట్ల ఉన్న వ్యాపార సంస్థల సమాహారం. ఒకే బ్రాండ్‌తో ఆ సంస్థ నిర్వహించే స్టోర్స్ అన్నింటిలో ఒకే విధమైన సేవలు, ఉత్పత్తులు, ధరలు ఉంటాయి. పంపిణీ వ్యవస్థ, సిబ్బంది శిక్షణ, యాజమాన్యం కేంద్రీకృతమై ఉంటాయి. అన్ని స్టోర్స్ ఒకే కంపెనీ పర్యవేక్షణలోగాని, ఫ్రాంచైజీలుగా గాని ఉండవచ్చు. రెండు రకాల స్టోర్స్ కోసం ఒకేచోట కొనుగోళ్లు చేసి సరఫరా చేయడం జరుగుతుంది. సెంట్రలైజ్డ్ మార్కెటింగ్, కొనుగోళ్లు ఈ సంస్థల ప్రత్యేకత. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేయడం వల్ల తక్కువ ధరకు సరుకులు వస్తాయి. తక్కువ వ్యయం. ఎక్కువ లాభం.
భారత్‌లో చైన్ స్టోర్స్ ఏర్పాటు కేవలం సరకుల వ్యాపారానికే పరిమితం కాలేదు. వివిధరకాల వస్తువులు కొంటుంటాం. పలురకాల సేవలను పొందుతుంటాం. మనిషికి కావలసిన కూడు, గూడు, నీడ వంటి కనీస అవసరాలకు తోడు ఇప్పుడు విద్య, వినోదం, రవాణా వంటివి కూడా అత్యవసరాలుగా మారుతున్నాయి. పుస్తకాల దుకాణాలు, బస్సు సర్వీసులు, విద్యా సంస్థలు కూడా చైన్లను నిర్వహిస్తున్నాయ. వస్త్రాల దుకాణాలలో బాంబే డయింగ్, రేమండ్స్, విమల్, దిగ్జమ్, రీడ్ అండ్ టేలర్ కంపెనీల చైన్ స్టోర్స్‌కు తోడుగా స్థానికంగా కొన్ని చైన్ స్టోర్స్ ఏర్పాటవుతున్నాయ. వివిధ రాష్ట్రాల మధ్య ప్రయాణానికి బస్సు సర్వీసుల ద్వారా సేవలు అందించే సంస్థలు వెలిశాయ. పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వల్ల వారి వ్యాపారం దినదిన ప్రవర్థమానమవుతోంది.
చరిత్ర
ప్రపంచంలో మొట్టమొదటి చైన్ స్టోర్స్ లండన్‌లో డబ్ల్యు.హెచ్.స్మిత్ పేరిట ఏర్పాటైంది. 1792లో హన్రీ వాల్టన్ స్మిత్ తన భార్యతో కలసి ఈ స్టోర్స్‌ను ఏర్పాటు చేశారు. పుస్తకాలు, స్టేషనరీ, పత్రికలు, వార్తాపత్రికలు, వినోద ఉత్పత్తులకు ఆ స్టోర్స్ ప్రసిద్ధిచెందింది. అమెరికాలో చెయిన్ స్టోర్స్ శకం 1859లో దిగ్రేట్ అట్లాంటిక్ అండ్ పసిఫిక్ టీ కంపెనీ (ఎ అండ్ పి)తో మొదలైంది. 1920నాటికి అమెరికాలో మూడు జాతీయ స్థాయి చైన్ స్టోర్స్ -- ఎ అండ్ పి, వూల్‌వర్త్స్, యునైటెడ్ సిగార్ స్టోర్స్-- వెలిశాయి. ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే 2004 నాటికి వాల్‌మార్ట్ అతిపెద్ద రిటైల్ చెయిన్‌గా అవతరించింది.
చైన్ స్టోర్స్ వల్ల లాభనష్టాలు
పట్టణాలు, నగరాల్లో అన్ని చోట్లా చైన్ స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ఉండడంతో చిల్లర దుకాణాలు పెద్ద ఔట్‌లెట్లతో పోటీ పడలేకపోతున్నాయని కొంతమంది వాపోతున్నారు. అయితే ఒక విధంగా ఈ చైన్ స్టోర్స్ వివిధ రకాల ఉత్పత్తులు సేవలను, ఉపాధి అవకాశాలను, తక్కువ ధరలను అందించడం ద్వారా స్థానికులకు లాభదాయకంగా ఉంటున్నాయి.
సమకాలీన సమాజానికి చైన్ స్టోర్స్ కనీవినీ ఎరుగని రీతిలో సదుపాయంగా ఉంటున్నాయి. అవి నిలకడగా ఒకే స్థాయి వ్యాపారాన్ని కొనసాగిస్తాయి. ఒక ప్రాంతంలో ఉండే ఒక ఎలక్ట్రానిక్స్ దుకాణంలో వేరే ప్రాంతంలో ఉండే దుకాణంలో ఉండే అన్ని వస్తువులూ ఉంటాయి. ఫలితంగా ఆ దుకాణం అందరి గుర్తింపును పొందడమే కాకుండా ఆధారపడేలా కూడా చేస్తుంది. పెద్ద చైన్ స్టోర్స్‌లో ఒకే చోట అనేక వస్తువులు ఉండడం వల్ల జనానికి అవసరమైన అన్ని వస్తువులకు ప్రధాన దుకాణంగా మారుతుంటుంది. ఉదాహరణకు ఒక ఎలక్ట్రానిక్స్ స్టోర్స్ చెయిన్‌లో అన్నిచోట్ల ఎంపిక చేసిన బ్రాండ్ల వస్తువులు అమ్మకానికి లభ్యమవుతాయి. అదే పెద్ద చెయిన్ స్టోర్స్‌లో ప్రాథమిక అవసరాలను తీర్చే అన్నిరకాల వస్తువులు ఒకేచోట అందుబాటులో ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యంగా చెయిన్ స్టోర్స్‌కు ఉన్న సదుపాయం ఏమిటంటే కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేయడంవల్ల, ఎక్కువ మంది
వినియోగదారులు స్టోర్స్‌ను సందర్శించడం వల్ల స్టోర్‌లో ప్రదర్శించే ప్రకటనల వల్ల వాటికి ప్రచారం లభిస్తుంది. స్థానిక ఉత్పత్తులకు కూడా చెయిన్ స్టోర్స్ ద్వారా ప్రచారం కల్పించడం వల్ల వాటి మార్కెట్ పెరిగి ఎక్కువమంది కొనేందుకు దోహదమవుతుంది. ఈ కంపెనీలు వివిధ స్టోర్స్ మధ్య పెట్టే పోటీల వల్ల వారు ధరలు తగ్గించి అమ్మకాలు పెంచుకునేందుకు చూస్తారు. అప్పుడు కూడా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది.
చైన్ స్టోర్స్‌ను వినియోగదారుడి ఆధారిత పెట్టుబడిదారీ సమాజానికి ప్రతినిధిగా చెప్పవచ్చు. సామాజిక హోదాను నిర్ణయించే ఉత్పత్తులను చైన్‌స్టోర్స్ నిల్వ చేస్తాయి గనుకనే సాంస్కృతిక చిత్రాన్ని రూపుదిద్దే సామాజిక సంస్థలుగా వీటిని పేర్కొనవచ్చు. అందువల్ల వినియోగదారులకు అవసరమైన, కోరుకునే వస్తువులను అమ్మినప్పటికీ ఈ స్టోర్స్ వినియోగదారుడికి ఏది కావాలో, ఏమి కోరుకోవాలో కూడా చెప్తాయి. అయితే ఒకే స్థాయి వస్తువులు ఒకే చోట కేంద్రీకృతం కావడం సంస్కృతిని దెబ్బ తీస్తుందని కొందరు వాదించవచ్చు. ఉదాహరణకు చైన్ మ్యూజిక్ దుకాణాలు ఎక్కువగా పాపులర్ అయిన కళాకారుల పాడిన పాటల రికార్డులు, సిడిలు లాంటివాటినే స్టాక్ చేస్తూ, వారికన్నా తక్కువ ప్రజాదరణ పొందిన సాధారణంగా ఔత్సాహిక కళాకారుల పాటలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వవు. అంతేకాక సొంత వ్యాపారాల ద్వారా ఒకరి చేతినుంచి మరొకరి చేతికి మారే సంపదను చైన్ స్టోర్స్ దోచేస్తున్నాయని, అందువల్ల ఆర్థికంగా ఇవి ప్రమాదకరమైనవని కూడా విమర్శకులు ఆరోపిస్తుంటారు.
స్థానిక దుకాణాల యజమానులు ఒకవేళ తాము ఇప్పుడున్న వస్తువులను మార్చినప్పటికీ ఒక చిన్న పట్టణంలో చైన్‌స్టోర్స్‌కన్నా ఎక్కువ ఉపయోగకరంగా ఉండవచ్చు. ఎందుకంటే స్థానిక యజమానులు స్థానిక వ్యవహారాల్లో ఎక్కువగా మమేకం అవుతూ ఉండడమే కాకుండా స్థానికంగా తమ వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు. చైన్ స్టోర్స్ సమాజ స్వరూపాన్ని మార్చివేస్తున్నాయని, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలహీనం చేస్తున్నాయని విమర్శిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఆయా ప్రాంతాల్లో స్థానికులే సొంతంగా నిర్వహించే చిన్న చిన్న దుకాణాలు ఉండేవి. అయితే ఇప్పుడు ఈ దుకాణాల స్థానంలో పెద్ద పెద్ద మాల్స్, ఫ్రాంచైజీలు వచ్చేసాయి. స్థానిక రాజకీయ వేత్తలకు పన్ను ఆదాయాన్ని అందించే జాతీయ స్థాయి చైన్‌స్టోర్స్‌కు పన్ను రాయితీలు, అభివృద్ధి రాయితీలు తరచూ ఇస్తున్నారు. ప్రధాన చైన్స్ లక్ష్యమల్లా కూడా స్థానికంగా ఉండే వ్యాపారాలను పక్కకు నెట్టి వాటి కస్టమర్లను, రాబడులను లాగేసుకోవాలన్నదే. ఆదాయం కోసం చైన్‌స్టోర్స్ చేసే ఆలోచనలన్నీ కూడా లోపభూయిష్టంగానే ఉంటున్నాయి. వినియోగదారులు ఇతర దుకాణాల్లో ఖర్చు చేసే సొమ్మునంతా ఇవి లాగేసుకుంటున్నాయి. అయితే పోటీ లేకపోవడం వల్ల పెద్ద దుకాణాలు అసమర్థంగా మారిపోయి కొన్ని సంవత్సరాలకే జాతీయ స్థాయిలో నిర్దేశించిన స్టాండర్డ్స్‌కు చేరుకోలేక పోతాయి. అప్పుడు ఆ స్టోర్ మూతపడిపోయి భవనం ఖాళీగా ఉంటుంది. దీంతో మరో కొత్త వ్యాపారం ఆ భవనంలోకి రావడానికి అవకాశం కల్పిస్తుంది.
స్వతంత్ర వ్యాపారాల స్థానంలో చైన్ స్టోర్స్ రావడం చాలా దేశాల్లో వివాదాలకు దారి తీసి ఈ చైన్ స్టోర్స్ పుట్టగొడుగుల్లాగా పుట్టుకురాకుండా నిరోధించడానికి స్వతంత్ర వ్యాపారులు సంఘటితం అయ్యేలా కూడా చేస్తున్నాయి. అమెరికన్ పుస్తక వ్యాపారుల అసోసియేషన్, అమెరికా స్వతంత్ర రెస్టారెంట్ల మండలి లాంటి జాతీయ స్థాయి వాణిజ్య గ్రూపులలోను, స్వతంత్ర వ్యాపార సంఘటన లాంటి ప్రాంతీయ ఆధారిత కూటములలోను ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విదేశాల్లో జాతీయ స్థాయి సంస్థలు ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహిస్తున్నాయి. స్వతంత్రంగా ప్రాంచైజీలు లేకుండా ప్రారంభించే వ్యాపారాలే ఫ్రాంచైజీ వ్యాపారాలకన్నా కూడా ఎక్కువ విజయవంతమయ్యే అవకాశాలున్నాయి అధ్యయనాలు కూడా సూచిస్తున్నాయి. ఎక్కువగా ఫ్రాంచైజీ వ్యాపారాలు వచ్చినప్పటికీ చిన్న వ్యాపారాలు కూడా వినియోగదారులకు అవసరమే అవుతాయి.
చిన్నపాటి స్వతంత్ర వ్యాపారం కన్నా పెద్ద పెద్ద చైన్‌స్టోర్స్ ఎక్కువ వ్యాపారాన్ని కొనసాగిస్తుంటాయి. కేవలం ఒకే రకమైన ఉత్పత్తులకు పరిమితం కాకుండా అవి అనేక రకాల బ్రాండ్ల ఉత్పత్తులను విక్రయిస్తాయి. ఒకే చోట తక్కువ ధరకు ఎక్కువ రకాలను అందించడం ద్వారా వినియోగదారులను ఆకర్షించడానికి ఇది ఓ మంచి మార్గం. చైన్‌స్టోర్స్‌ను సమాజంలోని కొంతమంది స్వాగతిస్తున్నారు. ఎందుకంటే అవి చిన్న దుకాణాల ఉద్యోగులను తీసుకుని వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. కొన్ని సందర్భాల్లో వీటిని చిన్న దుకాణాల యజమానులు కూడా స్వాగతిస్తుంటారు. ఎందుకంటే పోటీ లేకుండా చేసుకోవడం కోసం ఆ చైన్‌స్టోర్స్ చిన్న దుకాణాలకు భారీ ధర చెల్లించి కొంటుంటాయ.
ఓన్లీ విమల్
బాంబే డయింగ్, రేమండ్స్ రిటైల్ స్టోర్స్‌తో నిండిన మార్కెట్‌లో ధీరూబాయ్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ గ్రూప్ 80వ దశకంలో 3ఓన్లీ విమల్2 స్టోర్స్‌ను ప్రారంభించి సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా ప్రతి పట్టణంలో 3ఓన్లీ విమల్2 స్టోర్స్ వెలిశాయి. కేవలం సంపన్నులకు మాత్రమే
పరిమితం కాకుండా అన్నివర్గాల వారికి అందుబాటులో ఉండే ధరల్లో మేలైన వస్త్రాలను అందించాలన్నది విమల్ వ్యాపారలక్ష్యం. దేశవ్యాప్తంగా 24 కంపెనీ స్టోర్స్‌కు తోడు 200 ఫ్రాంజైజీలున్నాయి. ఇప్పుడు రిలయెన్స్ గ్రూప్ కొత్తగా ప్రవేశపెట్టిన రిలయెన్స్ మార్ట్, రిలయెన్స్ ట్రెండ్స్‌లో కూడా విమల్ కలెక్షన్‌ను అమ్ముతున్నారు.
డబ్బావాలా
సేవల రంగంలో ప్రధానంగా చెప్పుకోవలసింది ముంబైకి చెందిన డబ్బావాలాలను. ముంబై నగర శివార్లలో ఉన్న నివాసప్రాంతాల నుంచి ఉద్యోగులు, కార్మికుల మధ్యాహ్న భోజనం క్యారేజీలు, బాక్స్‌లను సేకరించి ఆయా ఉద్యోగుల ఆఫీసులు, ఫ్యాక్టరీలకు వెళ్లి వాటిని అందజేయడం, తిరిగి ఖాళీ క్యారేజీలను వారి వారి ఇళ్ళలో ఇవ్వడం డబ్బావాలాల విధి. ఇది ముంబై నగరమంతటా విస్తరించి ఉన్న చెయిన్.
జనసాంద్రత ఎక్కువగా ఉన్న ముంబై మహానగరంలో ఆఫీసులకు, ఫ్యాక్టరీలకు వెళ్లాలంటే చాలా దూరం సబర్బన్ రైళ్ళలో ప్రయాణించవలసి ఉంటుంది. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్లడానికి, హోటళ్ళలో భోజనం చేయడానికి బదులు చాలా మంది ఉద్యోగులు తమ ఇంటి నుంచి, కొన్నిసార్లు కేటరింగ్ వ్యాపారుల నుంచి డబ్బావాలాల చేత క్యారేజీలు తెప్పించుకుంటారు.

ప్రతి డబ్బామీద ఓ ప్రత్యేక గుర్తింపు, రంగు లేదా కోడ్ ఉంటుంది. దాని ఆధారంగా ఏ ప్రాంతానికి, ఏ ఫ్యాక్టరీకి, ఏ ఉద్యోగికి చెందిన క్యారేజీయో గుర్తిస్తారు. ఇళ్ళనుంచి సేకరించిన టిఫిన్ బాక్స్‌లను సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌కు చేరుస్తారు. అక్కడి నుంచి నిర్ణీత స్టేషన్లకు వెళ్లే రైళ్ళలో పంపుతారు. అక్కడ దించుకుని ఆయా ఫ్యాక్టరీలలో ఉద్యోగులకు అందజేసేందుకు తీసుకువెళతారు.

డబ్బావాలా పరిశ్రమ ప్రతి సంవత్సరం 5-10శాతం పెరుగుతోంది. ఒక్కొక్క డబ్బావాలా సగటున నెలకు నాలుగైదు వేల రూపాయలు సంపాదిస్తాడు. ప్రతిరోజు దాదాపు రెండున్నర లక్షల టిఫిన్ బాక్స్‌లను నాలుగున్నర నుంచి ఐదువేల మంది డబ్బావాలాలు చేరవేస్తుంటారు. వీరిలో చాలా మంది నిరక్షరాస్యులైనప్పటికీ వారు అందజేసే అరవై లక్షల బాక్స్‌లలో ఒకటికి మించి తప్పులు జరగవని ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది.

ఇంతకాలం లోకల్‌రైళ్లు మినహా టెక్నాలజీ సేవలు వినియోగించుకోని డబ్బావాలాలు ఇప్పుడిప్పుడే మొబైల్ ఎస్‌ఎంఎస్ సదుపాయాన్ని వాడుకుంటున్నారు. 1880లో ఈ సేవలు ప్రారంభమైనప్పటికినీ 1890లో మహదేవ్ హవాజీ బచ్చే ఈ సేవను వ్యవస్థీకృతం చేసి మొదట వంద మందితో ఈ సేవను ప్రారంభించారు.

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన డబ్బావాలాలను గురించి బిబిసి ఓ డాక్యుమెంటరీని నిర్మించింది. ముంబై వచ్చినప్పుడు బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ కూడా డబ్బావాలాలను కలుసుకున్నారు. ఇప్పుడు అనేక బిజినెస్ స్కూళ్లు డబ్బావాలాల ప్రతినిధులను తమ సంస్థలకు ఆహ్వానించి వారి విధులను గురించి తెలుసుకుంటుంటాయి.

బచ్‌పన్ స్కూల్స్
బాల్యం ఆటపాటలతో సాగాలి. అదే విధంగా చదువుకూడా. ఈ లక్ష్యంతో బచ్‌పన్ కార్పొరేట్ గ్రూప్ ఏర్పాటైంది. రెండేళ్ళ నుంచి ఐదేళ్ల మధ్య వయసుగల బాలలకోసం బచ్‌పన్ ప్లేస్కూల్స్‌ను ఈ సంస్థ ప్రారంభించింది. ఆ పాఠశాలలో బోధనాంశాలను సొంతంగా తయారుచేయడమే కాక తమ టీచర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ఈ గ్రూప్ ప్రత్యేకత.
1995లో బచ్‌పన్ మొదటి ప్లే స్కూలు ప్రారంభం కాగా ఇప్పుడా సంఖ్య 600లను దాటింది. ప్రపంచ శ్రేణి వౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు , అంతర్జాతీయ ప్రమాణాలుగల బోధనా పద్ధతులను పాటించడం ద్వారా బాలలను ఉత్తమ విద్యార్థులుగా మాత్రమే కాక ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు, నియత విద్యాభ్యాసానికి సిద్ధంచేసేందుకు కృషిచేస్తున్నట్లు బచ్‌పన్ చెప్పుకుంటున్నది. దేశంలోనే పాఠశాలకు ముందు బోధన జరుపుతున్న ప్రీ స్కూల్స్‌లో బచ్‌పన్‌ను ఉత్తమమైందిగా భావించవచ్చు.

క్రాస్ వర్డ్
పుస్తకాలు అమ్మే దుకాణాల చైన్‌లో ప్రధానంగా క్రాస్‌వర్డ్‌ను పేర్కొనాలి. షాపర్స్ స్టాప్ లిమిటెడ్ చైన్ స్టోర్స్‌కు అనుబంధంగా ఉన్న క్రాస్‌వర్డ్ దేశంలోనే అతిపెద్ద బుక్‌స్టోర్ చైన్. దేశవ్యాప్తంగా క్రాస్‌వర్డ్‌కు ముంబ, బెంగళూరు, అహ్మదాబాద్, ఘజియాబాద్, పుణే, వడోదరా, కోల్‌కతా, చెన్నై, జైపూర్, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో మొత్తం 45స్టోర్స్ ఉన్నాయ.
1992లో క్రాస్‌వర్డ్ మొదటి స్టోర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి క్రాస్‌వర్డ్ అనేక పురస్కారాలను పొందింది. అతి పురాతనమైన బుక్ స్టోర్స్‌లో ఎ. హెచ్. వీలర్‌ను, హిగిన్ బాథమ్స్‌ను పేర్కొనాలి. వీలర్ బుక్ స్టోర్స్ దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్లలో ఉంటాయ. హిగిన్ బాథమ్స్ స్టోర్స్ అనేక నగరాలలో దర్శనమిస్తుంటాయి.

రెస్టారెంట్ చెయిన్
రెస్టారెంట్ చెయిన్ ఒకే విధమైన ఆహార పదార్థాలు, పానీయాలు, సేవలు అందించే రెస్టారెంట్ల బృందం. అన్నీ ఒకే యాజమాన్యం కింద గాని, వేర్వేరు యాజమాన్యాల కింద ఫ్రాంచైజీలుగా గాని ఉండవచ్చు. అన్ని రెస్టారెంట్లలో ఒకే ప్రామాణికమైన మెనూ, సర్వింగ్ పద్ధతులు ఉంటాయి. వీటిలో ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్లను ప్రధానంగా పేర్కొనాలి. ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే మెక్‌డోనాల్డ్, కెఎఫ్‌సి వంటివి రెస్టారెంట్ చెయిన్లు. మారియట్, రమడా హోటల్ చెయిన్లు ఉన్నాయి. కాగా మనదేశంలో ఇండియా హోటల్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న తాజ్ గ్రూప్‌ను, ఐటిసి వారి వెల్‌కమ్ గ్రూప్‌ను పేర్కొనవచ్చు.

కేఫే కాఫీ డే
కాఫీ ప్రియుల అభిరుచులకు అనుగుణంగా రకరకాల కాఫీలను అందిస్తున్న కాఫీ డే కేఫ్‌లు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. దేశంలోనే అతి పెద్ద కాఫీ వాణిజ్య సంస్థ అమాల్గమేటెడ్ బీన్ కాఫీ ట్రేడింగ్ కంపెనీలో కాఫీ డే భాగంగా ఉంది. దాదాపు 10వేల ఎకరాలలో కొండప్రాంతాలలో విస్తరించి ఉన్న కాఫీ తోటల నుంచి సేకరించిన కాఫీ గింజలతో తయారుచేసే కాఫీకి వినియోగదారుల ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్‌లో 1996లో మొట్టమొదటి కేఫ్ ప్రారంభించారు. అలా మొదలైన కాఫీ డే ప్రయాణం ఆగకుండా సాగుతూ దేశంలో అతిపెద్ద రిటైల్ కాఫీ చైన్‌గా ఎదిగేలా చేసింది. ఇప్పుడు వియన్నా, కరాచీ, ప్రేగ్‌లలో కూడా కాఫీ డే కేఫ్‌లున్నాయి. కేఫ్‌ల చైన్లతో పాటు కాఫీ డే అమెరికా, ఐరోపా, జపాన్‌లకు కాఫీని ఎగుమతి చేస్తూ కాఫీ ఎగుమతిదార్లలో కూడా అగ్రస్థానానికి చేరుకుంది.

గడచిన కొన్ని సంవత్సరాలలో భారత్‌లో దైనందిన జీవనానికి అవసరమయ్యే సరుకులు, ఆహారపదార్థాలు, పళ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, బేకరీ ఉత్పత్తులు అమ్మే చైన్ స్టోర్స్ సంఖ్య బాగా పెరిగింది. ఈ క్రమంలో ఫుడ్‌వరల్డ్, స్పెన్సర్స్, రిలయెన్స్ ఫ్రెష్, హెరిటేజ్, మోర్ వంటి చైన్ స్టోర్స్ అవుట్‌లెట్లు నగరాలు, పట్టణాలు అనే తేడాలేకుండా అన్నిచోట్ల వెలుస్తున్నాయి.

త్రినేత్ర...మోర్
పాతిక సంవత్సరాల కిందట హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రారంభమైన త్రినేత్ర సూపర్ మార్కెట్ అంచెలంచెలుగా ఎదిగి రాష్టవ్య్రాప్తంగా 100శాఖలకు విస్తరించింది. ఆ తరువాత త్రినేత్రను ఆదిత్య బిర్లా గ్రూపు తీసుకుంది. వివిధ రాష్ట్రాలలో పలు బ్రాండ్ నేమ్‌లతో ఉన్న స్టోర్స్‌ను ఆదిత్య బిర్లా గ్రూప్ మోర్ పేరిట నామకరణం చేసింది. దక్షిణాదిలో ఆదిత్య బిర్లా గ్రూప్ 3మోర్2 సూపర్ మార్కెట్ల సంఖ్య 275కు పెరిగింది.

ఫుడ్‌వరల్డ్
దైనందిన జీవనానికి అవసరమయ్యే అనేక రకాల సరుకులు విక్రయిస్తున్న సూపర్‌మార్కెట్ల చైన్ ఫుడ్‌వరల్డ్. బెంగళూరు, హైదరాబాద్‌లలో ఫుడ్‌వరల్డ్‌కు అరవైకి పైగా స్టోర్స్ ఉన్నాయి. ఈ ఏడాది చివరినాటికి హైపర్ మార్కెట్లు, సూపర్‌మార్కెట్లు, ఎక్స్‌ప్రెస్ స్టోర్స్ ఏర్పాటు ద్వారా తమ స్టోర్స్ సంఖ్యను 200కు పెంచుకోవాలని ఫుడ్‌వరల్డ్ భావిస్తోంది. డెరీఫామ్ ఇంటర్నేషనల్ గ్రూప్‌లో ఫుడ్‌వరల్డ్ ఒక అంగం. డెయిరీ ఫామ్ ఇంటర్నేషనల్‌కు దేశ విదేశాలలో 5300కు పైగా అవుట్‌లెట్లున్నాయి. ఎనభైవేలకు పైగా ఉద్యోగులున్న ఈ గ్రూప్ వార్షిక అమ్మకాలు 900కోట్ల డాలర్లను దాటాయి.

రిలయెన్స్ ఫ్రెష్
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ వ్యాపార విభాగంలో రిలయెన్స్ ఒకటి. ఇదికాకుండా రిలయెన్స్ మార్ట్, రిలయెన్స్ డిజిటల్, రిలయెన్స్ ఫూట్‌ప్రింట్, రిలయెన్స్ ట్రెండ్జ్, రిలయెన్స్ వెల్‌నెస్, రిలయెన్స్ జివెల్స్, రిలయెన్స్ టైమ్‌అవుట్, రిలయెన్స్ సూపర్ కూడా ఉన్నాయి. ఇప్పటికే రిలయెన్స్ ఫ్రెష్ చైన్ అవుట్‌లెట్ల సంఖ్య 560 దాటింది. వచ్చే నాలుగేళ్ళలో రిటైల్ డివిజన్‌లో రూ.25వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని రిలయెన్స్ ఇండస్ట్రీస్ యోచిస్తోంది. రిలయెన్స్ ఫ్రెష్ స్టోర్స్‌లో కూరగాయలు, పచారీ సరుకులు, తాజా పళ్లు, పళ్లరసాలు, చాక్‌లెట్లు, డెయిరీ ఉత్పత్తులు అమ్ముతారు. అయితే కొన్ని రాష్ట్రాలలో కూరగాయల వర్తకుల దాడుల కారణంగా ఆయా రాష్ట్రాలలో పళ్లు, కూరగాయల అమ్మకాలను తగ్గించాలని రిలయెన్స్ ఫ్రెష్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

బిగ్‌బజార్
‘ఇంతకన్నా చవకగా మరియు మంచిగా మరెక్కడా లేవు’ అనే నినాదంతో వ్యాపారం నిర్వహిస్తున్న బిగ్‌బజార్‌కు దేశవ్యాప్తంగా 133 స్టోర్స్ ఉన్నాయి. బిగ్‌బజార్ చైన్ ఫ్యూచర్ గ్రూప్ యాజమాన్యంలో ఉంది. ఆయా ప్రాంతాల పర్వదినాల సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే బిగ్‌బజార్ ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్న సమయంలో కూడా మాంద్యం మాట ఎత్తకుండా కస్టమర్లకు మంచి మంచి డీల్స్‌ను ఆఫర్ చేయడంతో లక్షలాది మంది బిగ్‌బజార్ స్టోర్స్‌ను సందర్శించారు. స్థానిక పర్వదినాల సమయంలో తోలుబొమ్మలాటలు, శాస్ర్తియ సంగీత కచేరీలు, జానపద నృత్యప్రదర్శనలు ఏర్పాటు చేయడం వల్ల సరుకుల కొనుగోళ్లు చేయడంతో పాటు కస్టమర్లు వినోద కార్యక్రమాలను తిలకించే అవకాశాన్ని కూడా బిగ్‌బజార్ కల్పిస్తోంది. ఫ్యూచర్ గ్రూప్‌లో ఇంకా దుస్తులు అమ్మే చైన్ స్టోర్స్ పాంటలూన్స్, ఈ-జోన్ కూడా ఉన్నాయి.

కన్నీళ్ల నుంచి కాసులు

ab December 1st, 2011
ఇటీవలి కాలంలో అత్యంత విస్తృతంగా న్యూస్ హెడ్ లైన్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన సినిమా! సినిమా అనౌన్స్‌మెంట్ నుండి ఇప్పటివరకూ ఈ సినిమా ఏదో ఒక రూపంలో వివాదాలు సృష్టిస్తూనే ఉంది. అసలు ఈ సినిమా నేపథ్యం- 1980 దశకంనాటి దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీ అనీ, అందులోనూ ఆనాటి సెక్సీ నటి సిల్క్‌స్మిత రియల్ లైఫ్ ఈ సినిమాకు ఆధారం అనీ ప్రకటించినప్పటి నుండీ, ఇది ఒకవైపు ఆసక్తినీ, మరోవైపు ఆక్షేపణలనీ సృష్టించింది..
సిల్క్‌స్మిత పాత్రలో విద్యాబాలన్ నటించడం కూడా ఈ దుమారానికి మరింత ఆజ్యం పోసింది... ఇక సిల్క్‌స్మిత బంధువులు ఈ సినిమాపై కోర్టును ఆశ్రయించడం ఇటీవలి ట్విస్ట్. దీనిని అధిగమించడానికి గాను, ఈ సినిమా నిర్మాత ఏక్తాకపూర్ ప్లేట్ మార్చేసి ‘డర్టీ పిక్చర్’ సినిమా సిల్క్‌స్మిత లైఫ్ స్టోరీ కాదని ప్రెస్‌మీట్‌లలో చెప్పింది... మొత్తంమీద ఏక్తాకపూర్ మాత్రం తన సినిమాకు కావలసినంత పబ్లిసిటీని, క్రేజ్‌ని ప్రేక్షకులలోనూ, మీడియాలోనూ సృష్టించింది... ఇదంతా బాగానే ఉంది. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఇప్పుడు తెరమీదకు వచ్చిన అంశం ఏంటంటే- ప్రముఖ వ్యక్తుల నిజ జీవిత గాధల పేరిట, నిర్మాత, దర్శకులు చేస్తున్న ఈ పని వారి వ్యక్తిగత జీవితాలలోకి చొరబడటం కాదా? ప్రముఖుల వ్యథలను హైలైట్ చేసి తమ ఆదాయాలని పెంచుకోవడం కాదా? ప్రముఖుల కన్నీళ్ళని ‘క్యాష్’ చేసు కోవడం కాదా?
గతంలో లేవా?
పబ్లిక్ పర్సనాలిటీలు, సెలెబ్రిటీలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథలను తెరకెక్కించడం అనేది ప్రస్తుతం ‘డర్టీ పిక్చర్’ సినిమాతో చర్చనీయాంశం అయింది. కానీ ఈ సంస్కృతి భారతీయ సినిమాలో ఓ ‘్ధరణి’గా చాలాకాలంనుంచే ఉందని చెప్పాలి... అంతేగాక, ఈ తరహా సినిమాల నిర్మాణం కేవలం బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాదని కోలీవుడ్ (తమిళ సినీ పరిశ్రమ), మాలీవుడ్ (మలయాళ సినీ పరిశ్రమ)లో కూడా జరిగిందని చెప్పాలి... అయితే, ఇప్పటివరకూ నిజజీవితం (రియల్ లైఫ్) ఆధారంగా వచ్చిన ‘‘రీల్ లైఫ్’’ సినిమాలను కూలంకషంగా పరిశీలిస్తే, అవి ప్రధానంగా రెండు రకాలుగా ఉన్నాయని అర్ధమవుతుంది.
* నిజ జీవిత సంఘటనలు- ఘటనల స్ఫూర్తితో తీసిన సినిమాలు
* నిజ జీవిత వ్యక్తుల జీవన ఘట్టాల స్ఫూర్తితో తెరకెక్కిన సినిమాలు...
సంఘటనలే ముడిసరుకు:
రోజూ దేశవ్యాప్తంగా ఎనె్నన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి... అయితే వాటిలో కొన్ని మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. ప్రాంతం, భాష, కాలాలకు అతీతంగా ఓ మర్చిపోలేని ఘటనగా మిగిలిపోతాయి... అలాంటి సంఘటనలే సినీ నిర్మాత- దర్శకులకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆ యధార్థ

సంఘటనలకు కొంత డ్రామా... మరికొంత కల్పన జోడించి సినిమాలు తెరకి ఎక్కించడం జరిగింది... అలాంటి సినిమాలకి రియల్ ఇన్సిడెంట్స్ ముడిసరుకుగా మారాయి.
1992లో బాబ్రీమసీదు కూల్చివేత యావత్ దేశాన్ని కదిలించిన వాస్తవిక సంఘటన. ఈ యధార్థ సంఘటనని నేపధ్యంగా చేసుకుని ‘‘బొంబాయి’’ (1995) సినిమాని మణిరత్నం తీసారు. అలాగే 2002 గుజరాత్‌లోని మత కల్లోలాలని ఆధారంగా చేసుకుని రాహుల్ ధోలాకియా ‘‘పర్జౌనియా’’ (2007) అనే సినిమానీ, ప్రముఖ నటి- చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షు

రాలు నందితాదాస్ ‘‘్ఫరాఖ్’’ అనే సినిమానీ తీసారు. అలాగే ముంబైలోని లోఖండ్‌వాలా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మాఫియా గ్యాంగ్‌కు- పోలీసులకు జరిగిన రియల్ ఎన్‌కౌంటర్ ఆధారంగా ‘‘షూటవుట్ ఎట్ లోఖండ్‌వాలా’’ (2007) సినిమాని తీసారు. ‘‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’’ కూడా ఈ తరహా లోనిదే.ఇక, దేశవ్యాప్తంగా సెనే్సషన్ సృష్టించిన క్రైమ్ కేసు- నీరజ్ గ్రోవర్ హత్య కేసు. ఈ సంఘటనని స్ఫూర్తిగా తీసుకుని రామ్‌గోపాల్‌వర్మ ఈమధ్యే ‘‘నాట్ ఎ లవ్ స్టోరీ’’ అనే సినిమాని తీసారు. ఇలా రియల్ లైఫ్ సంఘటనలని ఆధారంగా చేసుకుని వచ్చిన సినిమాలు అన్నీ ప్రేక్షకులలో కావలసినంత ఇంట్రెస్ట్‌ని సృష్టించాయి. దానికి తగిన ఆదాయాలను కూడా ఆర్జించాయి.
రియల్ లైఫ్ కథలు:
సాధారణంగా, మన సినీ ప్రపంచంలో వ్యక్తుల నిజజీవిత గాధలను సినిమాలుగా తీయడాన్ని ‘‘బయోపిక్’’ జెనర్ సినిమాలు అంటారు. అయితే వీటిలో ఆయా వ్యక్తుల నిజ జీవితాన్ని సాధ్యమైనంత యధాతథంగా ఎలాంటి కాల్పనికతకూ తావులేకుండా ‘‘డాక్యుమెంట్’’ చేస్తారు... అయితే ఇవన్నీ అత్యున్నత కథా విలువలు- ప్రమాణాలు- విస్తృత అధ్యయనం- రీసెర్చ్ అనే నాలుగు స్తంభాలపై నిర్మించడం సహజం... కానీ ఈ ‘జెనర్’కు భిన్నంగా, నిజ జీవిత వ్యక్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని ఎక్కువ కల్పన- డ్రామాలను మేళవించి కమర్షియల్ తరహాలో తీసిన సినిమాలే అత్యంత వివాదస్పదం అయ్యాయి. ఎందుకంటే, ఈ ‘‘ఇన్‌స్ప్రైర్‌డ్ సినిమాల’’లో కథలను దర్శకుడు బాక్సాఫీస్ మెకానిజంను, ఆడియెన్స్‌లోని ఎమోషన్స్‌ని దృష్టిలో పెట్టుకుని తీస్తాడు. దీనివల్ల అనివార్యంగా వాస్తవికత కాస్తా మరుగున పడిపోయి ఆసక్తికరమైన డ్రామానే డామినేట్ చేస్తుంది... ఈ కోవకు చెందిన సినిమానే ‘‘ద డర్టీ పిక్చర్’’ కూడా
అయితే, ఈ స్టైల్‌లో ఇదివరలో సైతం ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ సినిమాలు- ‘ది బ్యాండిట్ క్వీన్’ (్ఫలన్‌దేవి జీవితం), బవందర్ (్భన్వారీదేవి జీవతం), ప్రోవోక్‌డ్ (కిరణ్‌జిత్ అహ్లువాలియా జీవితం), గ్యాంగ్‌స్టర్ (అబూసలెమ్- మోనికా బేడీల ప్రేమ వ్యవహారం), కంపెనీ (దావూద్-్ఛటారాజన్ జీవితం), ‘డి’ (దావూద్ జీవితం), అబ్‌తక్ చప్పన్ (దయానాయక్ జీవితం), వో లమ్హే (పర్వీన్‌బాబీ జీవన దృశ్యం), సర్కార్ (బాల్‌థాకరే జీవన ఇతివృత్తం), గురు (్ధరూభాయ్ అంబానీ), చక్ దే ఇండియా (మీర్ రంజన్ నేగి క్రీడా జీవితం), రక్తచరిత్ర (పరిటాల రవి-సూరి జీవన దృశ్యాలు), రణ్ (జీటీవీ సుభాష్‌చంద్ర జీవితం) వంటివి ఉన్నాయి... అలాగే మలయాళంలో ‘తిరక్క్థ’ (నటి శ్రీవిద్య జీవితం ఆధారం), బెంగాలీలో ‘ఇతిమృణాళిని’ (అపర్ణాసేన్ డైరెక్షన్), భూమిక (మరాఠీ నటి హంసావాడ్కర్ జీవితం) ‘ఖోయాఖోయా చాంద్’ (గురుదత్ జీవితం) ఉన్నాయి. ఇక అప్పట్లో ఆంధీ (ఇందిరాగాంధీ జీవిత గాధ) సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.
రియల్ కథలంటే ఆసక్తి ఎందుకు?
ప్రస్తుతం మన దేశంలో గొప్పగా చెప్పుకునే దర్శకులలో మొదటిశ్రేణి దర్శకులందరూ ‘రియల్ లైఫ్’ ఆధారంగా ‘రీల్ లైఫ్’ సినిమాలని సృష్టించినవారే... వీరికి కాల్పనిక కథలకన్నా నిజ జీవిత గాథలే ‘కిక్’ ఇస్తాయని వారి సినిమాలని గమనిస్తే అర్థం అవుతుంది. వారిలో రామ్‌గోపాల్‌వర్మ, మణిరత్నం, మిలన్ లూధ్రియా, మధుర్ భండార్కర్ (చాందినీబార్, పేజ్ 3, ఫ్యాషన్ సినిమాలన్నీ రియల్ లైఫ్ నుంచి ఇన్‌స్పిరేషన్ పొందిన సినిమాలే...) వంటి టాప్ దర్శకులున్నారు.అయితే సినిమా కథలకి ‘రియల్’ కథలే ఎందుకు అనేది ఓ ఆసక్తికరమైన ప్రశ్న.
నిజ జీవిత సంఘటనలు- వ్యక్తుల జీవన గాథలు సహజంగానే ప్రేక్షకులకు ఆసక్తిని కల్గించే అంశాలు. న్యూస్ రూపంలో, టాపికల్ డిస్కషన్స్ రూపంలో ఈ కథలను సగటు పౌరులు సైతం విని- చూసి- చర్చించి ఉంటారు. ఇలా ప్రేక్షకులకు ‘తెల్సిన నిజం’అనేది ఈ తరహా రియల్ లైఫ్ సినిమాలకు మిగతా సినిమాలకన్నా అదనపు ఆసక్తిని ప్రేక్షకుల మదిలో సృష్టిస్తోంది. మరోవైపున నిజ జీవిత సంఘటనలని కథలుగా చెప్పుకోవడం సాధారణ మానవ మనస్తత్వం... సైకాలజిస్టుల ప్రకారం ఈ గాథలను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నపుడు, ఇతరులతో ‘షేర్’చేసుకొంటున్నపుడు వ్యక్తులు వాటిని తమ మస్తిష్కంలో దృశ్యీకరించుకోవడం జరుగుతుంది. ఇలా తాము ఊహించుకున్న చిత్రాలు- తెరపై చిత్రాలతో ఏమేరకు ‘మ్యాచ్’ అవుతాయో తెల్సుకోవాలనే ‘‘హ్యూమన్ ఇంటెరెస్ట్’’కూడా ఈ సినిమాలపై క్యూరియాసిటీకి కారణం.
ఇవేగాక, గొప్పవారుగా భావించే వ్యక్తులలోని చీకటి కోణాలని, సాధారణ మానవ తప్పిదాలని తెల్సుకోవాలనే సహజ ఆసక్తి కూడా ఓ కారణం... భారతదేశమంతటికీ సక్సెస్ స్టోరీగా నిలిచిన అంబానీ కట్నంకోసం తనకన్నా వయసులో పెద్ద అయిన అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడనే పర్సనల్ విషయం ప్రేక్షకులలో, ఆయన అఛీవ్‌మెంట్‌కన్నా ఎక్కువ ‘కిక్’నిస్తుంది. ఈ తరహా ‘ఎమోషన్స్’ని తట్టి లేపడంలో ఈ ‘రియల్ సినిమాలు’ సక్సెస్ అవుతున్నాయి... ఈ నేపథ్యంలోనే ‘డర్టీ పిక్చర్’ కూడా అదే ‘ఎలిమెంట్’ని హైలైట్ చేసి, ప్రేక్షకుల సహజమైన సైకలాజికల్ ఎమోషన్స్‌తో ‘ప్లే’ చేస్తోంది...
ఇక, సినిమా పరంగా, ఈ తరహా సినిమాలకి ఫ్రీ పబ్లిసిటీ, మీడియాలో హైప్... డిబేట్స్ తప్పనిసరిగా ఏర్పడ్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులలో సినిమాని తీయడం ఒకెత్తయితే, ఆ సినిమాని ప్రేక్షకుల దగ్గరకు చేర్చడం మరో ఎత్తు. దీనికోసం ఓ సాధారణ సినిమాకు ప్రచార వ్యయాల రూపంలో అధిక మొత్తం ఖర్చు అవుతోంది... అదే ఈ ‘‘రియల్ సినిమాల’’ విషయానికొస్తే, ఇదంతా ఏమీలేకుండానే మీడియా ద్వారా ఫ్రీ పబ్లిసిటీ వస్తోంది. పైగా ‘‘మనోభావాలు’’ పేరిట ‘కాంట్రవర్సీ’ కూడా మొదలవుతోంది. దీంతో కోర్టు కేసులు, ఊరేగింపులు, నిషేధాలు, సెన్సార్ కత్తెరలు... ఇలా జరిగే ప్రతీ సంఘటనా ఆ సినిమాకు మీడియాలో అదనపు ప్రచారానే్న ఇస్తోంది. ఇదిలా ఉండగా, మనుషుల స్వభావంలో వివాదాలన్నా, కాంట్రవర్సీలన్నా ఓ ప్రత్యేక ఆసక్తి... ఈ ‘సైకలాజికల్ వీక్‌నెస్’ని కూడా ఈ సినిమాలు తట్టి లేపుతాయి.. ప్రేక్షకులను థియేటర్లవరకూ రప్పిస్తాయి. తాజా ‘డర్టీ పిక్చర్’ కూడా ఇదే సూత్రాన్ని పాటించింది.
వ్యక్తి‘గతం’పై దాడి?
ఈ తరహా రియల్ లైఫ్ సినిమాలు వ్యక్తుల అంతరంగిక జీవితాలపై దాడిగా కూడా భావించాల్సి వస్తోంది. ఇది భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు, వ్యక్తి స్వేచ్ఛకు భంగం అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజ్యాంగంలోని అధికరణం 21 ప్రకారం, భారతీయ పౌరులైన ప్రతి ఒక్కరూ జీవించే హక్కును కలిగి ఉన్నారు. ఆ ‘‘జీవించడం’’ అనడంలో గౌరవంగా, మర్యాదగా, హుందాగా జీవించడం అనే అర్ధం అంతరార్ధంగా ఉంది. అయితే రియల్ లైఫ్ కథలతో వస్తున్న సినిమాలు, ఆయా వ్యక్తులు- ప్రముఖుల స్థాయికి- గౌరవానికి భంగం కలిగించే రీతిలో ఉండటం కూడా అనివార్యంగా జరుగుతోంది. ఆ లెక్కన ఇది గర్హనీయమే.
మరోవైపున, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, ప్రతి భారతీయుడికీ ‘‘్భవ ప్రకటనా స్వాతంత్య్రాన్ని’’ ఇచ్చింది. సినిమా ,కళలు, సాహిత్యం వంటివన్నీ ఈ హక్కును ఆసరాచేసుకునే సృజనాత్మక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. అయితే ‘‘క్రియేటివ్ ఫ్రీడమ్’’ పేరిట ‘పర్సనల్ లైఫ్’పై వక్రీకరణాలు సమంజసమా? అనేది ‘ద డర్టీ పిక్చర్’ సినిమా మరోసారి లేవనెత్తింది.
అంతేగాక, ప్రముఖుల జీవితాలలోని కన్నీటి చీకటి కోణాలని, తమకు ఆదాయంగా మల్చుకోవడం ‘శాడిజమే’ అనీ ఈ తరహా ‘క్రియేటివ్ శాడిజమ్’ని ఎదిరించడం అవసరం అనే వాదన కూడా ఉంది. ఏదిఏమైనా సినీ నిర్మాత- దర్శకుల ‘క్రియేటివిటీ’కి వ్యక్తుల ‘డిగ్నిటీ’కి మధ్య జరిగే నిరంతర చర్చలో ‘ద డర్టీ పిక్చర్’ తాజా ఉదాహరణగా నిలిచిపోయింది... ‘‘ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్’’ అనే సామెతను మరోసారి నిరూపించింది. ఇలా ‘‘కన్నీళ్ళనుంచి కాసులు కురిపించడం’’ సాధ్యమనే నమ్మకం సినీ ఇండస్ట్రీలో ఉన్నంతకాలం ఇలాంటి డర్టీ పిక్చర్‌లు, నాటీ పిక్చర్‌లుగా... హాటీ పిక్చర్‌లుగా వస్తూనే ఉంటాయి...!

సృజనకు అగ్ర తాంబూలం.. దృశ్య మాధ్యమం,

December 9th, 2011
తాము చదివిన డిగ్రీలు పూర్తవగానే తమ కెరీర్ ప్లానింగ్ పూర్తయి పోయిందని చాలామంది అభ్యర్థులు అపోహపడుతుంటారు. ఇష్టమున్నా లేకపోయినా కోర్సులు పూర్తిచేసి చేతులు దులుపుకోవడమనేది నేటి విద్యార్థులకు అలవాటైపోయింది. అయితే డిగ్రీలు పూర్తయిన అనంతరం ఏర్పడే ఉద్యోగ పోటీని తట్టుకోవడం నేడు చాలామంది విద్యార్థులకు దుస్సాధ్యమే అయిపోయింది. రిటెన్ టెస్టుల దగ్గరనుంచి ఇంటర్వ్యూల వరకు నెగ్గుకు రావడానికి నేడు విద్యార్థులు చాలా శ్రమించాల్సి వస్తుంది. అలా శ్రమపడ్డ వాళ్లలోకూడా కేవలం రెండు శాతంమంది మాత్రమే ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతున్నారు. దానితో వారు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగ జీవితాన్ని అనుభవించాల్సి వస్తోంది. అయితే విద్యార్థులు కేవలం పుస్తకాలు, పరీక్షలు కాకుండా, సృజనాత్మకత వైపు దృష్టిపెట్టగలిగే అలాంటివారికి నేడు అమోఘమైన అవకాశాలున్నాయి. సృజనాత్మకత అనేది చదివితే వచ్చేది కాదని చాలామంది అంటున్నా విషయ పరిశీలన, ప్రసిద్ధ వ్యక్తుల గ్రంథాలు చదవడం, సమాజంలో చూసింది చూసినట్టు అంచనగా వేయడం, ప్రతి విషయాన్ని కొత్తగా చెప్పగలిగే నేర్పరితనం, స్క్రిప్టు రైటింగ్‌లో అవగాహన, భావ వ్యక్తీకరణ తదితర అంశాలను సాధన చేయగలిగితే అలాంటివారికి సృజనాత్మకమైన రంగంలో అమోఘ అవకాశాలున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా దినదిన ప్రవర్ధమాన మవుతున్న ప్రస్తుత తరుణంలో సృజనాత్మకశక్తి ఉన్న అభ్యర్థులకు పెద్ద పీటే లభిస్తోంది. న్యూస్, కరెంట్ అఫైర్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్, డాక్యుమెంటరీలు, టాక్‌షోలు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, కార్టూన్ ఫీచర్లు తదితర పనులను సమర్ధవంతంగా చేయడానికి సృజనాత్మకత గల అభ్యర్థులు అవసరమవుతారు. అలాగే ప్రత్యేకమైన సృజనాత్మకత అర్హతలు, అభిరుచులు కలవారికి రీసెర్చ్ అసోసియేట్లు, స్క్రిప్టు రైటర్లు, మ్యూజిక్ డైరక్టర్లు, వాయిస్ స్పెషలిస్టులు, గ్రాఫిక్ డిజైనర్లు, ఎడిటర్లు, డైరక్టర్లు, యాంకర్లు, సౌండ్ స్పెషలిస్టు తదితర ఉద్యోగాలుకూడా అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా నేడు విస్తృతంగా అభివృద్ధి చెందడంతో దానిని కొన్నివిధాలుగా విభజించారు. రిపోర్టింగ్, ఏంకరింగ్, ప్రొడక్షన్, పోస్ట్‌ప్రొడక్షన్ తదితరాలలో ఏ ఒక్క విభాగాన్ని సమర్ధవంతంగా నిర్వహించలేకపోయినా ఎలక్ట్రానిక్ మీడియా స్తంభించిపోతుంది. అందువల్ల ఆయా విభాగాలకు చెందిన అభ్యర్థులు ఎప్పటికప్పుడు మెళకువలతో ఉండాల్సిన అవసరం ఉంది.
రిపోర్టింగ్: రిపోర్టింగ్ విభాగంలో పనిచేసే అభ్యర్థులకు ఇంగ్లీషు, హిందీ భాషలతోపాటు ఇతర భాషల్లో కూడా పట్టు ఉండడం అవసరం. చెప్పదలచుకున్న విషయాన్ని క్లుప్తంగా, సమగ్రంగా, అందంగా చెప్పగలగాలి. చాంతాడంత విషయాన్ని రెండే రెండు ముక్కల్లో అందరికీ చెప్పగలిగే సామర్ధ్యాన్ని ఎప్పటికప్పుడు రిపోర్టింగ్‌లో పెంచుకోవాలి. ఇలా చేయగలిగిన వారికి ఈ విభాగంలో తిరుగుండదు. టెలివిజన్ రిపోర్టింగ్ చేసేవారికి కళ్లు,చెవులే కాదు అవసరమైతే కొత్త విషయాలను రిపోర్టింగ్ చేయడానికి ధైర్యం, చొరవ కావాలి. అందరూ చూసే దృష్టితో కాకుండా ఓ కొత్త కోణంలో ప్రతి విషయాన్ని కెమెరాలోకి బంధించగలిగే సామర్ధ్యమున్న అభ్యర్థులు మంచి రిపోర్టర్లుగా ఖ్యాతికెక్కుతారు. అలాగే ఈ విభాగంలో పనిచేసేవారికి విజువల్ సెన్స్ ఉండాలి. అంతేకాకుండా తామేం చెప్పదలచుకున్నారో అది ఖచ్చితంగా తెలిసి ఉండాలి.
స్క్రిప్టింగ్: టెలివిజన్ కార్యక్రమాలకు స్క్రిప్టింగ్ చేయడం ఓ కళ. ప్రొడ్యూసర్ లేదా దర్శకుడు చేస్తున్న కార్యక్రమాలు అందంగా, ఆహ్లాదభరితంగా, కన్నులకింపుగా తయారవ్వాలంటే సమర్ధవంతులైన స్క్రిప్టు రైటర్లు ఉండాల్సిందే. టెలివిజన్ కార్యక్రమాలకు స్క్రిప్టు అందించే అభ్యర్థులు ప్రతిభావంతులు, సమర్ధులు అయినపుడే ఆయా కార్యక్రమాలకు ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఈ రంగంలో స్క్రిప్టు రైటర్లకు పదాలు, భాషమీద పట్టు ఉండడం తప్పనిసరి. ఏ విషయాన్ని ఎంతవరకు ఖచ్చితంగా చెప్పగలగాలి అనే విషయం స్క్రిప్టు రైటర్లకు తెలిసి ఉండాలి. ఇదిలావుంటే ఇక టెలివిజన్‌లలో ప్రసారమయ్యే సీరియళ్లకు మాటలు, కథలు రాసేవారికి కూడా ప్రత్యేక అర్హతలుండాలి. సినిమా వేరు, టీవీ వేరు కాబట్టి వాటి వ్యత్యాసం స్క్రిప్టు రైటర్లకి పూర్తిగా తెలుసుండాలి. టీవీ ఫిలింకుగాని, కార్యక్రమానికి గాని, సినిమాకు గానీ మొదటి హీరో స్క్రిప్టు రైటర్. కనుక ఈ విభాగంలో స్థిరపడాలనుకునేవారు తమ సృజనాత్మకత శక్తిని ఎప్పటికప్పుడు పెంచుకోవాలి.
యాంకరింగ్: నిర్వాహకుడు రూపొందించిన కార్యక్రమాన్ని ప్రేక్షకుడి ముందుంచే సంధానకర్తగా యాంకర్ వ్యవహరిస్తాడు. కార్యక్రమం గురించి ప్రేక్షకుడికి తెలియజేసేది యాంకరే. యాంకరింగ్ విభాగంలో రాణించాలనుకునేవారికి కొన్ని ప్రత్యేకమైన అర్హతలుండాలి. ఆకర్షణీయమైన రూపం, చక్కని కంఠస్వరం ఉండాలి. వీటితోపాటు ఫిజిక్‌ని ఎప్పటికప్పుడు స్లిమ్‌గా ఉంచుకుంటూ ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి.
ఎడిటింగ్: టెలివిజన్ రంగంలో గానీ, సినిమా రంగంలో గానీ అత్యంత కీలకమైన పాత్రను ఎడిటింగ్ విభాగం పోషిస్తుంది. కెమెరాలో షూట్ చేసిన కార్యక్రమాన్ని ఖచ్చితంగా దృశ్య వీక్షణంగా చేసే బాధ్యతలను దర్శకుడి పర్యవేక్షణలో ఈ విభాగం చేపడుతుంది. ఈ విభాగంలోనే కార్యక్రమానికి వాయిస్ ఓవర్‌ని సంగీతాన్ని జతచేస్తారు.
కెమెరా: ఈ విభాగం అత్యంత కీలకమైనది. తీయదలచుకున్న విషయాన్ని అందంగా, ఆకర్షణీయంగా తీయగలగాలి. ఈ విభాగంలో పని చేసేవారు నేరుగా కెమెరామన్లుగా ఉద్యోగాల్లో చేరేకంటే కెమెరా అసిస్టెంట్ స్థాయినుంచి ఉద్యోగం చేపడితే కెమెరా ద్వారా తీయదలుచుకున్న వాటిని దృశ్యకావ్యం చేయవచ్చు. అలాగే కెమెరామెన్లకు ఓర్పు, సహనం తప్పనిసరి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి వాతావరణంలోనైనా దర్శకుడి అభిరుచికి తగ్గట్టుగా అందంగా తీయగలిగే ఓర్పు ఉండాలి. దాంతోపాటు ‘లైటింగ్ సెన్స్’ అనేది తప్పనిసరి. లైటింగ్ సెన్స్ లేని కెమెరామెన్ ఒక సమర్ధుడైన కెమెరామెన్‌గా రాణించడం దుర్లభం. అందువల్ల దృశ్యాలను కన్నులవిందుగా చేయగలిగే పనిని కెమెరామెనే్ల చేపడతారు. కాబట్టి ఈ రంగంలో ఎదగాలనుకునే వారికి ఓర్పు, సహనంతోపాటు విజువల్ సెన్స్ తప్పనిసరని ముందుగానే గుర్తించాలి.
ఉద్యోగావకాశాలు
వివిధ ఇన్‌స్టిట్యూట్లు నిర్వహించే డిగ్రీ, డిప్లొమాలు పూర్తి చేసిన వారికి ట్రయినీ ప్రొఫెషనల్స్‌గా అద్భుతమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అయితే ఆయా డిగ్రీలు ఉద్యోగాన్ని ఇవ్వలేకపోయినప్పటికీ, ఆయా ఉద్యోగాలకు అర్హత మాత్రం ఇస్తాయి. అయినప్పటికీ సృజనాత్మకత శక్తి ఉన్న అభ్యర్థులకే పెద్ద పీట లభిస్తుంది. ట్రయినీ రిపోర్టర్లుగా చేరే అభ్యర్థులకు ప్రారంభ వేతనం 8వేల రూపాయలుంటుంది. ట్రయినీ అనంతరం సామర్ధ్యాన్ని బట్టి 15 వేల రూపాయలకు పైనే లభిస్తుంది. ఇదిలావుంటే ఇతర విభాగాల్లో అంటే స్క్రిప్టింగ్, యాంకరింగ్, ఎడిటింగ్, పోస్టు ప్రొడక్షన్ విభాగాలలో పనిచేసే వారికి ఖచ్చితమైన వేతనం ఉండదు. పై విభాగాలలో ఏ అభ్యర్థికైనా సామర్ధ్యం పైనే అతని వేతనం ఆధారపడి ఉంటుంది. అయినా కొన్ని సంస్థలలో ప్రొడక్షన్ అసిస్టెంట్లకు 6వేల నుంచి 12వేల రూపాయలవరకు వేతనం ఉంటుంది. ఎడిటర్‌గా చేరే అభ్యర్థులకు 6వేల నుంచి 25 వేల వరకు సామర్ధ్యాన్ని బట్టి ఉంటుంది. అలాగే ట్రైనీ గ్రాఫిక్ ఆర్టిస్టు ట్రైనింగ్ కాలంలో 6వేలనుంచి 8 వేల రూపాయల వరకు వేతనాన్ని పొందుతున్నారు. ఈ ఉద్యోగాలే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి చీఫ్ ఎడిటర్, చీఫ్ రిపోర్టర్, స్పెషల్ కరస్పాండెంట్, సబ్ ఎడిటర్లు, వాయిస్‌ఓవర్ ఆర్టిస్టులు, యానిమేటర్లు, ఆర్ట్ డైరక్టర్లు, సెట్ అసిస్టెంట్లు, లైట్ బాయ్‌లు, ప్రొడక్షన్ అసిస్టెంట్లు, పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్స్, మేకప్‌మెన్లు, కాస్ట్యూమ్ డిజైనర్లతోపాటు జనరల్ మేనేజర్ స్థాయినుంచి ఆఫీస్ బాయ్ వరకు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి ఆయా ఉద్యోగాలకు అభ్యర్థుల సామర్ధ్యాన్ని బట్టి వేతనాలుంటాయి.
కోర్సులు ఆఫర్ చేస్తున్న సంస్థలు
న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ సంస్థ జర్నలిజంలో పిజి డిప్లొమా కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సు కాల వ్యవధి తొమ్మిది నెలలు. డిగ్రీ అర్హతగా కోర్సును ఆఫర్ చేస్తున్నారు. న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలోని మాస్ కమ్యూనికేషన్ రిసెర్చ్ సెంటర్ మాస్ కమ్యూనికేషన్‌లో ఎంఎ డిగ్రీని ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి రెండు సంవత్సరాలు. న్యూఢిల్లీలోని ‘అకాడమీ 18’ సంస్థ ప్రొడ్యూసర్స్/డైరక్టర్స్/ఎడిటింగ్/ కెమెరా/జర్నలిజంలో ఆరు నెలల కోర్సును ఆఫర్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ఆసియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ సంస్థ ప్రోడక్షన్, డైరక్షన్, వీడియో ఎడిటింగ్, కెమెరా, టీవీ జర్నలిజం, ఏక్టింగ్‌లలో కోర్సులు ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సుల కాల వ్యవధి మూడు నెలలు. అలాగే థర్డ్ ఛానెల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో సంస్థ టీవీ, రేడియో, టీవీ జర్నలిజంలలో మూడునెలల సర్ట్ఫికెట్ కోర్సు ఆఫర్ చేస్తోంది.
కోర్సులు అందిస్తున్న ఇతర సంస్థలు
* ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్-పూణె
* మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్-న్యూఢిల్లీ
* జెఎన్‌టియు- హైదరాబాద్
* సెంట్రల్ యూనివర్సిటీ- హైదరాబాద్
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీతోపాటు అనేక విద్యా సంస్థలు మాస్ కమ్యూనికేషన్ జర్నలిజంలో వివిధ కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి.

Thursday, December 8, 2011

కండలు తిరిగిన మొనగాడు

కలకత్తాలోని హౌరా రైల్వేస్టేషన్‌లో శాండో కోసం అనేక వందల మంది ఎదురుచూస్తున్నారు. ట్రైన్ రావటానికి ఒక గంట ముందే అక్కడ ప్రజలు గుమిగూడారు. ఇండియన్ డైలీ న్యూస్‌లో ఆ సంఘటన గురించి ఇలా రాశారు. - "అనేకమంది యూరోపియన్లు, ఇండియన్లు కూడా స్టేషన్‌కు వచ్చారు. వీరిలో అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు ఉన్నారు. అప్పటిదాకా వారందరూ శాండో ఫోటోలు పుస్తకాలలో మాత్రమే చూశారు. రైలు కూత వినబడగానే అందరిలోను ఆతృత పెరిగింది. ముందుకు దూసుకువస్తున్న ప్రజలను పోలీసులు బలవంతంగా ఆపాల్సి వచ్చింది. శాండో దిగిన వెంటనే అందరూ అతనిని చుట్టుముట్టారు. కొందరు శాండో సామాన్యంగానే ఉన్నాడని గుసగుసలాడుకున్నా మొత్తం మీద శాండోకు ఘన స్వాగతం లభించిందనే చెప్పాలి.''

కలకత్తా రాయల్ థియేటర్‌లో కూడా శాండోకు మంచి ప్రజాదరణ లభించింది. శాండో షోకు మొత్తం హాలంతా నిండిపోయింది. అప్పర్ క్లాస్ మాత్రమే కాకుండా కింది కుర్చీలన్నీ కూడా నిండిపోయాయి. సీట్లు దొరకకపోవటం వల్ల చాలామంది నిలబడాల్సి వచ్చింది కూడా. కలకత్తాలో నివసించేవారే కాకుండా ఇతర ప్రాంతాల నుంచీ అనేకమంది ప్రముఖులు శాండోను చూడటానికి వచ్చారు. బ్రిటిష్‌వారు, భారతీయులు- శాండోకు స్వాగతం చెప్పటంలో పోటీలుపడ్డారు. బ్రిటిష్‌వారు- తమ సైనికులు, అధికారులకు శాండో కొన్ని వ్యాయామ మెలకువలు చెప్పాలని ఆశించారు. భారతీయులేమో అతనికి అలాంటి శరీరం రావటానికి వెనకున్న మర్మాన్ని తెలుసుకోవాలని భావించారు.

రాచ మర్యాదలు..
భారతీయులు శాండో పట్ల చాలా గౌరవాన్ని ప్రదర్శించారు. అతనికి అనేక బహుమతులు ఇచ్చారు. శాండో తన బృందంతో ప్రదర్శనలు ఇవ్వటానికి దేశంలో కొన్ని ప్రాంతాలు తిరిగాడు. అతను ప్రదర్శనలు ఇచ్చే టెంటుల్లో ఆరు వేల మంది పట్టేవారు. అయినా అనేక వేల మంది నిరాశతో వెనకకు తిరిగి వెళ్లిపోయేవారు. స్థానిక ప్రజలు అతనిని శాండో పహిహల్వాన్ అని పిలిచేవారు. భారతదేశంలో చాలా పేరు ప్రఖ్యాతులు గడించిన గామన్ బలివాలా పహిల్వాన్ తనతో పోటీకి రమ్మని శాండోకు సవాల్ విసిరాడు. అయితే శాండో ఈ సవాల్‌ను స్వీకరించలేదు. గామన్‌ను కుస్తీలో ఎదిరించటం అంత సులభమైన పని కాదని శాండోకు తెలుసు.

శాండోకు ఈ పర్యటనలో అనేకమంది మహారాజులు స్నేహితులయ్యారు. బరోడా మహారాజు గైక్వాడ్ తన ప్రైవేట్ మ్యూజియంలో ఉంచటానికి శాండో విగ్రహాన్ని తయారుచేయమని శిల్పులను ఆదేశించాడు. ఒక యువరాజు శాండోను తన ప్యాలెస్ నుంచి కారులో 40 మైళ్ల విహారానికి తీసుకువెళ్లాడు. "మేము వెళ్తున్న దారిలో చాలా చోట్ల బళ్లు ఉన్నాయి. మొదట వాటిని నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత వాటిని కావాలని ఉంచారా? లేకపోతే అవి ఆ ప్రాంతంలో ఎప్పుడూ ఉండేవేనా అనే అనుమానం వచ్చింది. అయితే- మోటారు పాడైపోతుందనే భయంతో, ఆ యువరాజు, ప్రతి మైలుకు ఒక బండిని ఉంచాడని తెలిసింది'' అని శాండో ఆ తర్వాత పేర్కొన్నాడు.

పరదా వెనక..
ముంబాయిలో శాండో కొత్త స్నేహితుడు ధున్‌జీభాయ్ బొమన్‌జీ శాండోను తన ప్యాలెస్‌కు ఆహ్వానించాడు. ఉన్నత వర్గాలకు చెందిన పార్సీ మహిళలకు వ్యాయామానికి సంబంధించి కొన్ని సూచనలు ఇవ్వమని శాండోను కోరాడు. జనానాలో ఉన్న మహిళలు పరపురుషుల కంటబడరు కదా. పరపురుషులు కూడా జనానాలోకి వెళ్లకూడదు. అయితే శాండో కోసం ఈ నిబంధనను సడలించారు. "నాకు, వారికి మధ్య పూసలతో చేసిన ఒక పరదా ఉంది. దాని అవతల ఆ స్త్రీలు కూర్చున్నారు. నేను వారిని చూడకూడదని వారు ఉన్న ప్రాంతాన్నంతా చీకటి చేసేశారు. వారిపై కన్నేసి ఉంచటానికి కూడా కొందరు ఉన్నారు.

నేనున్న ప్రాంతమంతా చాలా కాంతివంతంగా ఉంది. నన్ను పరదా అవతల ఉన్నవారు చక్కగా చూసేలా. నేను వారి వైపు తిరిగి సులభమైన వ్యాయామాలు చేయటం మొదలుపెట్టాను. పరదా అవతల నుంచి కొన్ని కదలికలు మొదలయ్యాయి. వారు నన్ను అనుకరిస్తూ వ్యాయామం చేస్తున్నారని అర్థమయింది. పాఠం చెప్పటం పూర్తయిన తర్వాత - పరదా అవతల ఉన్న స్త్రీలు - నా చేతి కండరాలను ముట్టుకుని చూడాలని ఉందని ఒక సందేశం పంపారు. నేను పరదాకు దగ్గరగా వెళ్లాను. నా చేతులను పైకి ఎత్తి కండరాలను బిగించాను. ఒక అరడజను చిన్న చేతులు నా కండరాలను తడిమాయి..'' అని శాండో తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఇది జరిగినప్పుడు తన పక్కన తన సతీమణి కూడా ఉందని ఆయన ఎలాంటి వివాదమూ రాకుండా ఉండడానికి ముందే జాగ్రత్తపడి రాసుకున్నాడు.

జాతీయవాద పాఠాలు
ఒక పాత్రికేయుడు బెంగాలీలందరూ శాండో నేర్పిన పాఠాలను నేర్చుకుని వ్యాయామం చేయటం మొదలుపెడితే ఎలా ఉంటుందని ప్రశ్నించాడు. వారు కూడా తనలాగే అవుతారని, సున్నితంగా ఉండేవారు బలంగా అవుతారు అని శాండో సమాధానమిచ్చాడు. తాను నేర్పిన పాఠాలను నేర్చుకొని బలంగా అయిన అనేకమంది ఉదాహరణలను కూడా శాండో వివరించాడు. వ్యక్తులు బలంగా లేకపోవటమనేది జాతికి సంబంధించిన వ్యవహారం కాదని- పౌష్టికాహారం సరిగ్గా తీసుకోకపోవటం, సరైన వ్యాయామం చేయకపోవటం వల్ల మాత్రమే ఎవరైనా బలహీనంగా ఉంటారని పేర్కొన్నాడు.

"వ్యాయామం, పౌష్టికాహారం ఉంటే భారతీయులు బలంగా తయారవుతారు. పట్టుదల ఎక్కువ కనక మిగతా దేశాల వారి కంటే కూడా వారు త్వరగా బలాఢ్యులు కాగలిగే అవకాశం ఉంది. వారు తమ శరీరాలను జాగ్రత్తగా చూసుకుంటే 200 ఏళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు'' అని శాండో వ్యాఖ్యానించాడు. భారత జాతీయవాదుల ఆశయాలను ప్రొత్సహించే ఉద్దేశం శాండోకు లేదు. కాని తమ శరీరాలను బలిష్టంగా మార్చుకోవటం ద్వారా స్వాధికారతను సాధించటం సాధ్యమేననే సందేశం ఇచ్చి జాతీయవాదుల ఆశయాలను ప్రోత్సహించాడు. ఆ తర్వాత శరీర దారుఢ్యం - స్వాతంత్య్రానికి, రాజకీయ అధికారానికి తొలి అడుగుగా భావించినవారు అనేక మంది ఉన్నారు. వీరిలో స్వామి వివేకానంద కూడా ఒకరు. (స్వామి వివేకానంద మూడు 'బి'లను ప్రతిపాదించారు. అవి బీఫ్ (గొడ్డు మాంసం), బైసప్స్ (బలమైన ముంజేతి కండరాలు), భగవద్గీత). విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మేనకోడలు సరళాదేవి ఘోషాల్ శాండో పర్యటన తర్వాతే అతివాద నేతగా మారారు.

యోగాపై ప్రభావం
శాండో పర్యటన భారత్‌పై గణనీయమైన ప్రభావం చూపించిందనిప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు డబ్ల్యుటీ స్టెడ్ అభిప్రాయం. ఆ తర్వాత ట్రీట్‌మెంట్‌ల కోసం మహారాజులు లండన్ సెయింట్ జేమ్స్ వీధిలో ఉన్న శాండో ఆఫీసుకు వస్తూ ఉండేవారు. అనేకమంది మహారాజులు తమకు వ్యాయామాలను నేర్పటానికి ప్రతినిధులను భారత్‌కు పంపమని శాండోను కోరుతూ ఉండేవారని పేర్కొన్నారు. వీటితో పాటు యోగా పట్ల భారతీయులలో ఆసక్తి ఏర్పడటానికి కూడా ఒకరంగా శాండో పర్యటనే కారణం. ప్రస్తుతం ఉన్న ఆసనాల పద్ధతి ఆధారంగా చూస్తే- యోగా అనేది 20వ శతాబ్దం తొలి భాగంలో పుట్టిందే. కొందరు చరిత్రకారుల ఉద్దేశం ప్రకారం- ఆధునిక యోగాపై భారతీయ సంప్రదాయం కన్నా పాశ్చాత్యుల (శాండో వంటివారు) ప్రభావం ఎక్కువ ఉంది. అంతే కాకుండా ఇతర రంగాలపై కూడా శాండో ప్రభావం కనిపిస్తుంది. తొలి భారతీయ సినిమా నటులలో ఒకరైన రాజా బలంగా, మంచి శరీర ధారుడ్యంతో ఉండేవాడు. కనుక అతనికి రాజా శాండో అనే పేరు వచ్చింది. శాండోకు ఇండియా ఎంత నచ్చిందో, భారతీయులకు శాండో అంతగానూ నచ్చాడు. శాండోను 'దేహదారుఢ్యం గల ఫకీర్'గా భావించారు వాళ్లు.

ధున్‌జిభాయ్ బొమన్‌జీకి ఉన్న ఒక వ్యాధిని నయం చేసిన కారణంగా ఆయన శాండోకు చాలా ఎక్కువ మొత్తం ధనం ఇచ్చాడు. శాండో ఇండియాలోనే ఉండిపోతే ఏటా 10 వేల పౌండ్లు ఇస్తానని కూడా చెప్పాడు. శాండో దానికి ఒప్పుకోలేదు కాని లండన్ దగ్గర్లో తాను కట్టుకున్న ఇంటికి మాత్రం బొమన్‌జీ పేరు పెట్టుకున్నాడు. అలాగే బొమన్‌జీ ముంబయిలో ఆయన పేరుతో 'శాండో కాజిల్' కట్టాడు.